logo

రామాలయానికి విరాళం

మండల కేంద్రంలో రూ. కోటి వ్యయంతో నిర్మిస్తోన్న రామాలయానికి బీర్కూర్‌కు చెందిన కల్లు సాయిలు గురువారం ఆలయ కమిటీకి రూ.23 వేలు విరాళం అందజేశారు. అనంతరం

Published : 28 Jan 2022 03:23 IST

విరాళం అందజేస్తున్న దాత సాయిలు

బీర్కూర్‌, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో రూ. కోటి వ్యయంతో నిర్మిస్తోన్న రామాలయానికి బీర్కూర్‌కు చెందిన కల్లు సాయిలు గురువారం ఆలయ కమిటీకి రూ.23 వేలు విరాళం అందజేశారు. అనంతరం దాతను సన్మానించారు. ఎంపీపీ రఘు, కో ఆప్షన్‌ ఆరీఫ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్‌, నాయకులు సందీప్‌, రఘు, ఆవారి గంగారం, నర్ర సాయిలు, గంగాధర్‌, హైమద్‌, నారాయణ పాల్గొన్నారు.

భూమి పూజ

బీర్కూర్‌, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి గురువారం ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్‌ గురువారం భూమి పూజ చేశారు. సంఘం మండలాధ్యక్షుడు నాగయ్యచారి, పట్టణ అధ్యక్షుడు రమేష్‌, తెరాస మండలాధ్యక్షుడు వీరేశం, తెరాస యువజన సంఘం మండలాధ్యక్షుడు శశికాంత్‌, ఎంపీటీసీ సందీప్‌, కోఆప్షన్‌ ఆరీఫ్‌, రైసస గ్రామ అధ్యక్షుడు గంగారం, హైమద్‌, నారాయణ, నర్ర సాయిలు, రఘు, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని