logo

ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ

మండలంలోని గూడెం, శాబ్ధిపూర్‌తండా గ్రామాల్లో శనివారం రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పాల్గొని మాట్లాడారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Published : 22 May 2022 06:33 IST


రైతు డిక్లరేషన్‌ ప్రతులు అందజేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ

గూడెం, శాబ్ధిపూర్‌తండా(కామారెడ్డి గ్రామీణం), న్యూస్‌టుడే: మండలంలోని గూడెం, శాబ్ధిపూర్‌తండా గ్రామాల్లో శనివారం రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పాల్గొని మాట్లాడారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టించే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ అన్నారు. నాయకులు ఇంద్రకరణ్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌, భీమ్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని