logo

పూర్వ విద్యార్థి దాతృత్వం

మెండోరా జడ్పీ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి అలిశెట్టి లక్ష్మీనారాయణ రూ.2 లక్షల వ్యయంతో కంప్యూటర్లు కొనుగోలు చేసి శనివారం వితరణ చేశారు. బడిలో కంప్యూటర్‌ గదిని ప్రారంభించారు.

Published : 04 Dec 2022 04:02 IST

రూ.2 లక్షల విలువైన కంప్యూటర్ల వితరణ

దాత అలిశెట్టి లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న ప్రతినిధులు

మెండోరా(బాల్కొండ), న్యూస్‌టుడే: మెండోరా జడ్పీ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి అలిశెట్టి లక్ష్మీనారాయణ రూ.2 లక్షల వ్యయంతో కంప్యూటర్లు కొనుగోలు చేసి శనివారం వితరణ చేశారు. బడిలో కంప్యూటర్‌ గదిని ప్రారంభించారు. ఎంఈఓ రాజేశ్వర్‌ కోరిక మేరకు స్పందించిన ఆయన తన తల్లి రాజుబాయి స్మారకార్థం అందజేశారు. లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తండ్రి గంగాధర్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. దాత, ఎంఈఓను గ్రామస్థులు సన్మానించారు. సర్పంచి లక్ష్మి, రాజారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, ముత్యంరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఆరాధన, ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ మహేశ్వర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని