logo

అర్హులకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలి

అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 08 Feb 2023 05:40 IST

ర్యాలీలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌, నాయకులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఖాళీ స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. బల్దియా కార్మికులకు గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. నాయకులు రాజనర్సు, విజయ్‌, రంజిత్‌, భరత్‌, వీరయ్య తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని