logo

చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురి మృతి

నవరంగ్‌పూర్‌ జిల్లా డాబుగావ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న సరాగూడ గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి  కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

Published : 03 Dec 2022 10:06 IST

నవరంగ్‌పూర్‌ (ఒడిశా): నవరంగ్‌పూర్‌ జిల్లా డాబుగావ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న సరాగూడ గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి  కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరంగ్‌పూర్‌ నగరంలో గాదువాగూడ ప్రాంతానికి చెందిన ఎండీ సదామమ్‌చ రబిన్‌ హియాల్‌, షబాన్‌ హియాల్‌తోపాటు మరో ఇద్దరు కారులో ఉమ్మర్‌కోట్‌ నుంచి నవరంగ్‌పూర్‌కు కారులో వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కొరాపుట్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అన్సర్‌ ఖాన్‌ శనివారం ఉదయం మృతినట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని