బిజదలో అసమ్మతి సెగ
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పలువురు ప్రజాప్రతినిధుల రాజీనామా
మాట్లాడుతున్న గంగాధర్, వేదికపై టుని, సుజాత తదితరులు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఓ వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా, పురాధ్యక్షుడు మహేష్ పట్నాయక్ తన రాజీనామా పత్రాన్ని పార్టీ పరిశీలకుడు అతాను సవ్యసాచి నాయక్కు పంపారు. నేతల ఒత్తిడి వల్లే వారంతా ఈ చర్యకు పాల్పడుతున్నట్లు మరోవర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరు వర్గాలు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి ఆయా నేతలు ఏమన్నారంటే...
అనుసూయ ఆదివాసీ కాదు: తేజస్వీ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల మాట్లాడుతూ అనుసూయ మాఝికి టికెట్ కేటాయించడం సరికాదన్నారు. ఆమె ఆదివాసీ కాదని, ఇంతవరకు ఒక్క సమావేశం, కార్యక్రమంలో ఆమె ఆదివాసీ భాషలో మాట్లాడిందా అని ప్రశ్నించారు. గిరిజన భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలియని, పాటించని ఆమె ఆదివాసీ మహిళ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అనుసూయకు టికెట్ కేటాయించడం నచ్చకే రాయగడ సమితి అధ్యక్షురాలు టుని హుయిక, ఉపాధ్యక్షుడు హరప్రసాద్ హెప్రిక, పలువురు కౌన్సిలర్లు, జడ్పీ సభ్యులు, సమితి సభ్యులు, సర్పంచులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నారు. రానున్న రోజుల్లో వేలాది మంది పార్టీ శ్రేణులు రాజీనామా చేయనున్నారని పువ్వల పేర్కొన్నారు.
ఇది సమంజసం కాదు: ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో రాయగడ అసెంబ్లీ స్థానం టికెట్ ఓ మహిళకు దక్కడం మనకెంతో గర్వకారణమని, దీనిని స్వాగతించాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని బిజద సీనియర్ నేత వై.వెంకటేశ్వరరావు (కొండబాబు) అన్నారు. పార్టీ కార్యకర్తల కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ సీనియర్ నేత ఒత్తిడి వల్లే కొందరు రాజీనామాలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. నాలుగైదు రోజుల్లో అంతా సర్దుకుంటుందని, స్వప్రయోజనాల కోసం కొందరు లేనిపోని ప్రలోభాలు పెడతారని, వారి మోసంలో ఎవరూ పడొద్దని పార్టీ శ్రేణులకు కొండబాబు హితవు పలికారు. అనుసూయను భారీ మెజార్టీతో గెలుపించుకునేందుకు కార్యకర్తలంతా ఏకతాటిపై నడవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటర్లకు చేరువవుతున్న నేతలు
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. -
పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
[ 29-04-2024]
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. -
మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్
[ 29-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్ మధుసూదన్ దాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్దాస్ అభివర్ణించారు. -
మండుటెండల్లో.. చల్లచల్లగా!
[ 29-04-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. -
మౌనమేలనోయి!
[ 29-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
[ 29-04-2024]
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. -
డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
[ 29-04-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. -
పొట్టంగిలో భారీ వర్షం
[ 29-04-2024]
కొరాపుట్ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. -
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో: రాహుల్
[ 29-04-2024]
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్ గాంధీ సాలెపూర్ సమావేశంలో ఆదివారం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!