logo

బిజద గూటికి చేరిన వెంటనే రాణికి టికెట్‌

సంబల్‌పూర్‌ సిటింగ్‌ భాజపా ఎంపీ నితీష్‌ గంగదేవ్‌ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్‌ గంగదేవ్‌ మంగళవారం రాత్రి నవీన్‌ నివాస్‌లో సీఎం నవీన్‌ సమక్షంలో బిజదలో చేరారు.

Published : 18 Apr 2024 05:27 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సంబల్‌పూర్‌ సిటింగ్‌ భాజపా ఎంపీ నితీష్‌ గంగదేవ్‌ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్‌ గంగదేవ్‌ మంగళవారం రాత్రి నవీన్‌ నివాస్‌లో సీఎం నవీన్‌ సమక్షంలో బిజదలో చేరారు. నితీష్‌ గంగదేవ్‌ దేవ్‌గఢ్‌ రాజవంశానికి చెందిన వ్యక్తి. ఈసారి ఎన్నికల్లో ఆయనకు భాజపా నాయకత్వం టికెట్‌ ఇవ్వలేదు. సంబల్‌పూర్‌ స్థానానికి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ భాజపా తరఫున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాణి అరుంధతీ బిజదలో చేరిన నేపథ్యంలో బుధవారం సీఎం ఆమెను దేవ్‌గఢ్‌ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. భువనేశ్వర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... తాను భర్తతో కలసి దీర్ఘకాలంగా సేవలు చేస్తున్నానని, ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నానన్నారు. తనకు భాజపా పట్ల ద్వేషభావం లేదన్నారు. భర్త నితీష్‌ అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన అండదండలు తనకున్నాయని చెప్పారు. నవీన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు