ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్లో ర్యాంకు సాధించి..
‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు.
యువతకు ఆదర్శప్రాయం అనిమేష్
భువనేశ్వర్, న్యూస్టుడే: ‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. ఈ ఘనత సాధించేందుకు ఆయన ఎన్నో ప్రతికూలతలను అధిగమించారు.
తల్లిదండ్రులను కోల్పోయారు
అనుగుల్ జిల్లా తాల్చేరుకు చెందిన అనిమేష్ విద్యార్థి దశలో తండ్రి ప్రభాకర్ ప్రధాన్ను కోల్పోయారు. గుండెపోటుతో ఆయన 2015లో మృతి చెందారు. ఆయన తాల్చేరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహించేవారు. తండ్రి మరణం అనిమేష్కు తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తల్లి అరుణా భరత్పూర్ ఎంసీఎల్కు చెందిన బొగ్గు గనుల్లో ఉద్యోగిని. ఆమె ప్రోద్బలంతో అనిమేష్ రవుర్కెలా ప్రభుత్వ ఎస్ఐటీలో బీటెక్ పూర్తిచేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)లో దిల్లీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూ రోజుకు నాలుగు గంటలు సివిల్స్ రాసేందుకు పాఠ్యపుస్తకాలు చదివేవారు. ఈ తరుణంలో తల్లికి కేన్సర్ వ్యాధి సోకింది. తరచూ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆయన కోచింగ్ తీసుకోకపోయినా గతేడాది సివిల్స్ రాశారు. ఫలితాలు వెల్లడికాక ముందే గత నెల ఆయన తల్లి తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యుల్లో సోదరి అన్వేషా ప్రధాన్ మాత్రమే ఆయనకు అండగా నిలిచారు. తాను పడిన వేదనంతా దిల్లీలో పాత్రికేయులకు వివరించిన అనిమేష్ భౌతికంగా తల్లిదండ్రులు లేకపోయినా వారి ఆశీస్సులు తన ఆశయాన్ని నెరవేర్చడంలో సహాయపడ్డాయన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఇది తాను నేర్చుకున్న పాఠమని, యువత దీన్ని అలవర్చుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విభేదాలను దాటి అధికారం ‘చే’ జిక్కించుకుంటారా?
[ 01-05-2024]
అంతర్గత కలహాలు, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ను వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో పలువురు నేతలు బిజద, భాజపాల్లో చేరడంతో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారి కొరత ఏర్పడింది. -
నామినేషన్ దాఖలు చేసిన నవీన్
[ 01-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. -
మృత్యువుతో పోరాడుతున్న మగుణి
[ 01-05-2024]
తోలు బొమ్మలాటలో దేశవిదేశాల్లో ఖ్యాతి గాంచిన కేంఝర్కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి కుహర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. -
కలిసొచ్చిన స్కూటర్... దూసుకుపోతా రయ్..రయ్
[ 01-05-2024]
వ్యవసాయ శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్కు ప్రతిసారి ఎన్నికల్లో కలిసొస్తున్న స్కూటర్తో ఈసారి ప్రచారం ప్రారంభించారు. -
తండ్రి వెంట..కుమార్తె ప్రచారం ఇంటింట..
[ 01-05-2024]
బారాబటి కటక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా ఫిర్దోస్ తండ్రి మహమ్మద్ ముఖింతో కలిసి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. -
తెలుగులో పాట... ఓట్ల వేట
[ 01-05-2024]
పూరీ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ పాత్ర్ మంచి గాయకుడు. తెలుగు, ఒడియా, హిందీ గీతాలు పాడుతుంటారు. -
ఎన్నికల బరి... ఇంతులే మరి
[ 01-05-2024]
జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రెండు పార్టీలు నారీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నాయి. -
తొలి ఓటు అనుభూతి పొందండి
[ 01-05-2024]
కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. -
చిట్ఫండ్ బాధితుల విషయమై నవీన్ ఎందుకు మాట తప్పారు?
[ 01-05-2024]
చిట్ఫండ్ బాధితులైన 20 లక్షల మందికి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎందుకు మాట తప్పారో, బాధితులను ఎందుకు నట్టేట ముంచారో సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి సజ్జన్ శర్మ డిమాండ్ చేశారు -
చికిటిలో యాభై వేల మెజార్టీతో గెలిపించాలి: పాండ్యన్
[ 01-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్, చిన్మయానంద శ్రీరుప్ దేవ్లను శంఖద్వయం (జొడి శంఖొ) గుర్తుపై ఓటేసి గెలిపించాలని రాష్ట్ర 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్ ఓటర్లను కోరారు. నియోజకవర్గం పరిధిలో చికిటిపెంఠొలోని తళొబజారులో మంగళవారం సాయంత్రం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. -
జయపురం బరిలో 11 మంది అభ్యర్థులు
[ 01-05-2024]
జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి