మండే ఎండలో ప్రచారం... పదవి కోసం సాహసం
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
భువనేశ్వర్, న్యూస్టుడే
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పోటీలో ఉన్న నేతలకు రానున్న అయిదేళ్లలో అధికారం కనిపిస్తోంది. అలసిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతూ సాగుతున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు.
సమయం లేకపోవడంతో...
తొలివిడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రంలో నాలుగు విడతల్లో (మే 13, 20, 25, జూన్ 1) పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే ముందస్తుగా అభ్యర్థుల జాబితాలు ఖరారు చేస్తామన్న బిజద, భాజపా, కాంగ్రెస్ నాయకత్వాలు ఇంతవరకు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. జాబితాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో ముందంజ వేయకపోతే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో వెనుకబడిపోతామన్న దూరాలోచనతో నేతలు చెమటోడుస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతున్న ప్రచారం రాత్రి 9 వరకు జరుగుతోంది.
ఎన్నెన్ని సిత్రాలో
గడిచిన అయిదేళ్లు ఏసీ గదులు, కార్లలో తిరిగిన నేతలిప్పుడు మండుటెండలో ఆయాసం అనిపించినా ముందుకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయాచోట్ల నేతలు కర్భూజాలు తింటూ శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. కొన్నిచోట్ల వాటిని ఓటర్లకు పంచుతున్నారు. వృద్ధులకు పాదాభివందనాలు చేస్తున్నారు. యువతతో కరచాలనాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి హామీలిస్తున్నారు. కొన్నిచోట్ల ఓటర్లు ఎదురు ప్రశ్నలు వేసినా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా భరిస్తున్నారు.
బిజద, భాజపా ముందంజ
ఇంతవరకు ప్రచారంలో బిజద, భాజపా నేతలు ముందంజ వేశారు. కాంగ్రెస్ నాయకులు కాస్తంత ఆలస్యంగా ప్రారంభించారు. ఆ రెండు పార్టీల వద్ద సొమ్ములున్నాయని, అధికారంలో లేని తమకు జనం అండదండలు మినహా కాసులు లేవని హస్తం పెద్దలు చెప్పుకుంటున్నారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇక ప్రచారానికి దిగనుండగా ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విభేదాలను దాటి అధికారం ‘చే’ జిక్కించుకుంటారా?
[ 01-05-2024]
అంతర్గత కలహాలు, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ను వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో పలువురు నేతలు బిజద, భాజపాల్లో చేరడంతో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారి కొరత ఏర్పడింది. -
నామినేషన్ దాఖలు చేసిన నవీన్
[ 01-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. -
మృత్యువుతో పోరాడుతున్న మగుణి
[ 01-05-2024]
తోలు బొమ్మలాటలో దేశవిదేశాల్లో ఖ్యాతి గాంచిన కేంఝర్కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి కుహర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. -
కలిసొచ్చిన స్కూటర్... దూసుకుపోతా రయ్..రయ్
[ 01-05-2024]
వ్యవసాయ శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్కు ప్రతిసారి ఎన్నికల్లో కలిసొస్తున్న స్కూటర్తో ఈసారి ప్రచారం ప్రారంభించారు. -
తండ్రి వెంట..కుమార్తె ప్రచారం ఇంటింట..
[ 01-05-2024]
బారాబటి కటక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా ఫిర్దోస్ తండ్రి మహమ్మద్ ముఖింతో కలిసి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. -
తెలుగులో పాట... ఓట్ల వేట
[ 01-05-2024]
పూరీ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ పాత్ర్ మంచి గాయకుడు. తెలుగు, ఒడియా, హిందీ గీతాలు పాడుతుంటారు. -
ఎన్నికల బరి... ఇంతులే మరి
[ 01-05-2024]
జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రెండు పార్టీలు నారీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నాయి. -
తొలి ఓటు అనుభూతి పొందండి
[ 01-05-2024]
కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. -
చిట్ఫండ్ బాధితుల విషయమై నవీన్ ఎందుకు మాట తప్పారు?
[ 01-05-2024]
చిట్ఫండ్ బాధితులైన 20 లక్షల మందికి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎందుకు మాట తప్పారో, బాధితులను ఎందుకు నట్టేట ముంచారో సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి సజ్జన్ శర్మ డిమాండ్ చేశారు -
చికిటిలో యాభై వేల మెజార్టీతో గెలిపించాలి: పాండ్యన్
[ 01-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్, చిన్మయానంద శ్రీరుప్ దేవ్లను శంఖద్వయం (జొడి శంఖొ) గుర్తుపై ఓటేసి గెలిపించాలని రాష్ట్ర 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్ ఓటర్లను కోరారు. నియోజకవర్గం పరిధిలో చికిటిపెంఠొలోని తళొబజారులో మంగళవారం సాయంత్రం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. -
జయపురం బరిలో 11 మంది అభ్యర్థులు
[ 01-05-2024]
జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్యాయత్నం..
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు