మార్కెట్ కమిటీల గల్లాపెట్టెలు గలగల
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల గల్లా పెట్టెలు ఒక్కసారిగా నగదుతో నిండాయి. పౌరసరఫరాల నుంచి ఎప్పటి నుంచో రావల్సిన బకాయిలు కమిటీలకు జమకావడంతో వసూలులో లక్ష్యాన్ని దాటిపోయాయి.
లక్ష్యానికి మించి రుసుముల వసూళ్లు
న్యూస్టుడే, బొబ్బిలి, పార్వతీపురం పట్టణం
బొబ్బిలిలోని మార్కెట్ కమిటీ చెక్పోస్టు
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల గల్లా పెట్టెలు ఒక్కసారిగా నగదుతో నిండాయి. పౌరసరఫరాల నుంచి ఎప్పటి నుంచో రావల్సిన బకాయిలు కమిటీలకు జమకావడంతో వసూలులో లక్ష్యాన్ని దాటిపోయాయి. మరికొన్ని 200 శాతానికి మించడం విశేషం.
జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఈ ఏడాది రూ.10.43 కోట్ల మార్కెట్ రుసుములు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇంతవరకు రూ.12.14 కోట్లు వచ్చాయి. ఇందులో ఇతర పంటల నుంచి వసూలు చేసిన మార్కెట్ రుసుం రూ.5.78 కోట్లు రాగా, పౌరసరఫరాల సంస్థ నుంచి రూ.6.36 కోట్లు జమకావడంతో ఆ మొత్తానికి చేరుకుంది. ఇది 116 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన నాలుగు రోజుల వ్యవధిలో మరింత మొత్తం వసూలయ్యే అవకాశం ఉంది.
విడుదలయ్యాయి...
వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ కమిటీలు ఒక శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. దీనివల్ల కమిటీలకు ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో అత్యధికంగా పండేది వరి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను చేపట్టడంతో మార్కెట్ రుసుములు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఏటా కమిటీలు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. ఈ ఏడాది మాత్రం ఆయా బకాయిలు పౌర సరఫరాల నుంచి రూ.6.36 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కో కమిటీకి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకూ రావడంతో నిధులు సమకూరాయి. దీంతో లక్ష్యం వంద శాతం దాటిపోయింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో మార్కెట్ కమిటీల ఆదాయం లక్ష్యాన్ని మించి సమకూరింది. ఈ ఏడాది లక్ష్యం రూ.7.27 కోట్లకు గానూ రూ.11.91 కోట్లు వసూలు అయినట్లు ఏడీ అశోక్ కుమార్ తెలిపారు.
ప్రణాళికా యుతంగా
- శ్యామ్, ఏడీ, మార్కెటింగ్శాఖ, విజయనగరం.
మార్కెట్ కమిటీలు లక్ష్యాలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్లాం. చెక్పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసి రవాణా అయ్యే సరకులపై నిబంధనల మేరకు రుసుములు వసూలు చేశాం. ఆన్లైన్లో రుసుముల చెల్లింపుపై అవగాహన కల్పించాం. ట్రేడర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల ఆదాయం మరింత పెరిగింది. పౌరసరఫరాల నుంచి సకాలంలో బకాయిలు విడుదలయ్యాయి. దీంతో లక్ష్యానికి మించి వసూలు చేయగలిగాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చర్చ జరపకుండా సమావేశం ముగింపు
[ 09-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మండల సర్వసభ్య సాధారణ సమావేశం ఎలాంటి చర్చ లేకుండా ముగించారు. -
శిథిలావస్థలో ఓవర్ హెడ్ ట్యాంకు
[ 09-05-2024]
మండలంలోని తుమరాడ గ్రామంలో రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించిన రక్షిత తాగునీటి పథకం ఓవర్హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. -
ఓటేసిన వారిని కాటేసే రకం జగన్: చంద్రబాబు
[ 09-05-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
కలెక్టరేట్కే దిక్కులేదు.. రాజధానులు కడతారా!!
[ 09-05-2024]
ప్రభుత్వం ఎంత విఫలమైందో జిల్లాలో పాలన చూస్తే తెలుస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భవించి రెండేళ్లు దాటుతున్నా కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయారు. -
నేరడి.. హామీల గారడీ
[ 09-05-2024]
ప్రతి ఎకరాకు సాగు నీరందస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని దగా చేశారు. అయిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిస్సారంగా మార్చారు. -
సమన్వయంతో ఎన్నికల నిర్వహణ
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆర్వో, కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. -
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా పిలుపునిచ్చారు. -
కాలకూట విషం
[ 09-05-2024]
నకిలీ మద్యం మందుబాబుల పాలిట కాలకూట విషంగా మారింది.. ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్న మద్యానికి చాలామంది బానిసలైపోయారు. మత్తులో మునుగుతూ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. -
దీవిస్తానని... దివాలా తీయించావ్..!!
[ 09-05-2024]
తల్లిదండ్రులు కేవలం వారి పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారి మేనమామగా నేను అండగా ఉంటా.. కళాశాల, కోర్సుతో సంబంధం లేకుండా విద్యా, వసతి దీవెన అందిస్తా.. మీరు చదువుకోండి.. -
పర్యాటకంపై ‘జగన్ పడగ’
[ 09-05-2024]
ఎత్తయిన పచ్చని గిరులు, గలగల పారే కొండవాగులు, గుట్టల నుంచి జాలువారే సెలయేళ్లు, నదులకు నిలకడ నేర్పే జలాశయాలు, చారిత్రక అవశేషాల నిలయాలు, ఉత్సాహానిచ్చే సాహస క్రీడలు... -
యువతా మేలుకో.. భవిత మార్చుకో!
[ 09-05-2024]
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి. -
రాత్రికి రాత్రే ఇళ్లపై జగన్ స్టిక్కర్లు
[ 09-05-2024]
మండలంలోని బూడిపేట గ్రామంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే కొన్ని ఇళ్లపై జగనన్న స్టిక్కర్లు అతికించారు. -
పాలీసెట్లో మెరిసిన బాలికలు
[ 09-05-2024]
పాలీసెట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు అధిక సంఖ్యలో ఉతీర్ణులయ్యారు. విజయనగరం జిల్లాలో 3,182 మంది పరీక్ష రాయగా, 2,875 మంది (90.35 శాతం), పార్వతీపురం మన్యంలో 384 మంది పోటీపడగా 341 మంది (88.80 శాతం) బాలికలు పాసయ్యారు. -
మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
[ 09-05-2024]
భార్య మృతిచెందిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?