గుంత పూడ్చడానికీ.. డబ్బుల్లేవ్..!
కొత్త రహదారుల నిర్మాణంతో పాటు పాత వాటిపై ఉన్న గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రహదారులు, భవనాల శాఖది.
పార్వతీపురం-కూనేరు రహదారిపై అర్తాం వద్ద పరిస్థితి
పార్వతీపురం, న్యూస్టుడే: కొత్త రహదారుల నిర్మాణంతో పాటు పాత వాటిపై ఉన్న గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రహదారులు, భవనాల శాఖది. జిల్లాలో ఏటా రోడ్ల నిర్వహణకు రూ.కోటిన్నర వరకు అవసరం కాగా ప్రభుత్వం బడ్జెట్లో 272 ప్రధాన పద్దులో కేటాయిస్తుంది. జిల్లాల వారీగా సమర్పించిన ప్రతిపాదనల మేరకు విడుదల చేస్తుంది. ప్రస్తుతం నిర్వహణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ర.భ.శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై గుంతలున్నా బాగు చేయలేని పరిస్థితిలో ఇంజినీరింగ్ విభాగం ఉండిపోతోంది.
ఒడిశా, ఛత్తీస్గఢ్కు భారీ వాహనాలు జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో ఎక్కడికక్కడ రహదారులపై గోతులు పడుతున్నాయి. ఈ సమయంలో వర్షాలు పడితే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో రాష్ట్ర హైవేల నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల పాటు గుత్తేదారులకు అప్పగించేవారు. పెద్దా, చిన్నా లేకుండా ఎలాంటి మరమ్మతులు అయినా వారు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎక్కడైనా గుంతలు పడితే వాటిని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తూ వస్తుంది. 2022-23లో నిర్వహణ పనులకు రాష్ట్ర రహదారులకు రూ.77 లక్షలు, జిల్లా స్థాయి మేజర్ రోడ్లకు రూ.54 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పనులు చేపట్టగా ఇప్పటికీ కొన్నింటికి బిల్లుల చెల్లింపులు జరగలేదు.
బాగు చేయాల్సి ఉంది
జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 463.726 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిలో 180 కిలోమీటర్ల పొడవున నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. దీని కోసం రూ.85.54 లక్షలు అవసరమవుతుంది. కురుపాం, బలిజిపేట, సీతంపేట, తోటపల్లి, వీరఘట్టం, సీతానగరం సెక్షన్ల పరిధిలో 15 కిలోమీటర్లకు పైగా రహదారులను మెరుగుపర్చాల్సి ఉందని ర.భ.శాఖ అంచనా వేసింది. వీటితో పాటు మేజర్ జిల్లా రహదారులు, జిల్లా రహదారులు 565.813 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. వీటిలో 297 కిలోమీటర్ల మేర ఈ ఏడాది నిర్వహణ పనులు చేపట్టాలి. ఇందుకోసం రూ.120.31 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్లు పాడవుతున్న నేపథ్యంలో వాటిని బాగు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
నిధులు వస్తాయని చూస్తున్నాం
ఏటా రహదారుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఈ సారి రూ.205.85 లక్షలతో జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్వహణకు ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. అత్యవసర పనులు గుర్తించి ఉన్నంతలో చేస్తున్నాం. గతేడాది నిర్వహణ పనులు కూడా పూర్తి చేశాం. దానికి సంబంధించి కొంత మొత్తం రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా నిధులు వస్తాయని ఆశిస్తున్నాం. వచ్చిన వెంటనే ప్రతిపాదిత పనులు చేస్తాం.
జేమ్స్, ర.భ.శాఖ ఈఈ, పార్వతీపురం మన్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. -
హలో చీపురుపల్లి.. బై బై బొత్స
[ 10-05-2024]
ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
అయిదేళ్లు చూశారు.. గొంతెత్తారు
[ 10-05-2024]
అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. -
విశాఖ ఎంపీగా భరత్ను గెలిపించండి
[ 10-05-2024]
విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన భర్త ఎం.శ్రీభరత్ను గెలిపించాలంటూ అతని భార్య, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని కోరారు. -
పిడుగుపాటుతో మహిళ మృతి
[ 10-05-2024]
వంగర మండలం బంగారువలస గ్రామానికి చెందిన బౌరౌతు సత్తెమ్మ (57) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. -
అన్నదాతకు ఇక సంక్షేమమే
[ 10-05-2024]
వ్యవసాయాన్ని బంగారం చేసేందుకు, రైతులను ఆదుకునేందుకు ఎన్టీయే కూటమి ముందుకు వచ్చింది. సేద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుము బిగించింది. -
అతిరథుల మార్గం.. అడుగడుగునా అధ్వానం!
[ 10-05-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం. -
సకల జనుల సంక్షేమానికే.. సూపర్-6
[ 10-05-2024]
‘వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. దాడులు, దౌర్జన్యాలతోనే కాలం వెల్లదీశారు.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయలేదు.. -
వద్దంటే వద్దు..
[ 10-05-2024]
ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్పులను తీసుకునేందుకు భోజరాజపురం గ్రామస్థులు నిరాకరించారు. -
అప్పుల మావయ్య.. ఈ తిప్పలు చాలయ్యా
[ 10-05-2024]
ఆటో, మ్యాక్సీ క్యాబ్ చోదకులను ఆదుకుంటామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి వారిని నిండా ముంచేసింది. -
వారిది అభివృద్ధి మాట.. వీరిది మద్యం బాట
[ 10-05-2024]
పోలింగ్కు మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. -
309 పోస్టల్ బ్యాలెట్ల నమోదు
[ 10-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 309 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి 42 మంది ఓట్లు నమోదయ్యాయి. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
[ 10-05-2024]
సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
అమాత్యా.. అయిదేళ్లలో ఏం చేశారు..?
[ 10-05-2024]
సాలూరు పట్టణంలో అధ్వాన పరిస్థితులు వైకాపా అయిదేళ్ల పాలనకు అద్దం పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేయలేదు.. సరికదా గుంతలు కూడా పూడ్చలేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!