నామపత్రం.. నేడే ఆరంభం
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి రోజు నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
19, 24న ముహూర్తాలు
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి రోజు నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. వైకాపా అభ్యర్థుల్లో ఈ నెల 19న చీపురుపల్లి- మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య, బొబ్బిలి- శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కురుపాం- పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ- కళావతి, శృంగవరపుకోట- కడుబండి అప్పలనాయుడు, రాజాం- డాక్టర్ రాజేశ్, 24న పార్వతీపురం- అలజంగి జోగారావు, 22 లేదా 24న విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. సాలూరు అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర 19న పత్రాలపై ముహూర్తానికి సంతకాలు చేసి 24న దాఖలు చేస్తారని తెలిసింది.
ఈనాడు-విజయనగరం, న్యూస్టుడే- విజయనగరం అర్బన్, రాజాం: ఎన్నికల అధ్యాయంలో ప్రథమ ఘట్టం గురువారం మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజే ప్రధాన పార్టీల శ్రేణుల నుంచి నాయకుల వరకు ఆత్రుత కనిపించింది. ముహూర్త బలంతో మంచి ఆధిక్యత వస్తుందనే నమ్మకంతో పలువురు పండితులను ఆశ్రయించారు. మరికొందరు ఆయా పార్టీల అధినేతల నుంచి బి-ఫారాలు అందుకోవడం నుంచి నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టే వరకు శుభఘడియలు చూసుకున్నారు.
రెండు రోజులు మంచివే
18న దశమి, 19న ఏకాదశి ముహూర్తం బాగుంటుందని పండితులు సూచించడంతో అత్యధికంగా అభ్యర్థులు ఈ రెండు రోజుల్లో నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తొలిరోజు 18 కావడంతో తొమ్మిది సంఖ్య కూడా అదనపు బలాన్ని తెస్తుందని చెబుతున్నారు. తొలి రోజు కొందరు, రెండో రోజు 19న మరికొందరు దాఖలు చేసే అవకాశం ఉంది. మిగిలిన వారు ఈ నెల 24వ తేదీన ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కూటమి అభ్యర్థుల్లో నెల్లిమర్ల- నాగమాధవి, గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్, రాజాం- కోండ్రు మురళీమోహన్ 19న, పాలకొండ - నిమ్మక జయకృష్ణ 20న, పార్వతీపురం- బోనెల విజయచంద్ర, కురుపాం- జగదీశ్వరి 22న, చీపురుపల్లి- కిమిడి కళా వెంకటరావు, ఎస్.కోట- కోళ్ల లలితకుమారి, విజయనగరం- అదితి గజపతిరాజు, సాలూరు- గుమ్మిడి సంధ్యారాణి 24న నామినేషన్లు దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మిగిలిన వారు ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు 19న వేయనున్నట్లు సమాచారం.
సీసీ కెమెరాల నిఘాలో..
పూర్తిగా సీసీ కెమెరాలు, రికార్డింగ్ నడుమ ప్రక్రియ జరగనుంది. నామపత్రాలు స్వీకరించే గది, అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారు. పోటీ చేయబోయే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించి పత్రాలు అందజేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి తెలిపారు. నామపత్రాలపై సూచనలు, సలహాలకు హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్తో పాటు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సువిధ యాప్ ద్వారా దాఖలు చేసిన వారు, వాటి ప్రతులను భౌతికంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ‘మిత్ర’ ద్రోహం
[ 01-05-2024]
‘జగన్ మీ బిడ్డ.. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికలైన తర్వాత మరోలా.. ఉండేవాడు కాదు. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. -
నేనున్నానన్నావ్.. బొబ్బిలిని వదిలేశావ్
[ 01-05-2024]
అబద్ధపు హామీలు.. కపట ప్రేమ కురిపించి.. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత నిజస్వరూపం బయటపెట్టారు. -
బొబ్బిలి ఉత్తర కోట వద్ద జగన్ సభ
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలిలో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన బుధవారం ఖరారైంది. ముందుగా చంద్రబాబు ప్రజా సంకల్పయాత్ర జరిగిన చోట సభాస్థలం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. -
తొలిరోజు నుంచీ పోలీసుల హడావుడి
[ 01-05-2024]
సీఎం జగన్ సిద్ధం సభ బుధవారం ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో జరగనుంది. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
అవ్వాతాతలతో.. సర్కార్ పింఛనాట!
[ 01-05-2024]
వృద్ధులతో వైకాపా సర్కార్ పింఛనాట ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందించే వెసులుబాటు ఉన్నా.. పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
ఓ వినాశకారి.. ఈ వారధులు చూడోసారి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది.. -
ప్రతిపక్షాలపై కక్ష.. పండుటాకులకు శిక్ష
[ 01-05-2024]
పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. -
సంక్షేమ పథకాల పేరుతో జగన్ మభ్యపెట్టారు
[ 01-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి వారి చేతికి చిప్ప ఇస్తున్నారంటూ తెలగ, బలిజ, కాపు దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే స్వగ్రామంలో జయకృష్ణకు బ్రహ్మరథం
[ 01-05-2024]
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి(వైకాపా) స్వగ్రామం వండువలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
సొమ్మసిల్లిన సంధ్యారాణి
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి ఎండ వేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మంగళవారం ఆమె మక్కువ మండలంలోని పెద ఊటగెడ్డ గ్రామంలో ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!