జనాలు తక్కువ.. జెండాలెక్కువ
విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది.
సిద్ధం సభతో ఇక్కట్లు
ట్రాఫిక్ అంతరాయంతో చోదకుల అవస్థలు
విజయనగరం పట్టణం, రింగురోడ్డు, మయూరి కూడలి, అయ్యన్నపేట, కంటోన్మెంట్, గ్రామీణం, కోట, డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, న్యూస్టుడే: విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది. ఎండ కారణంగా చాలామంది ఆలస్యంగా వచ్చారు. అంతకు ముందు ప్రాంగణమంతా వెలవెలబోయింది. సభ కోసం భారీగా ఆర్టీసీ బస్సులను కేటాయించారు. అవేవీ సకాలంలో చేరుకోలేదు. సీఎం వచ్చి ప్రసంగం ప్రారంభించినా ఇంకా వస్తూనే ఉన్నాయి. వేదికతో పాటు ప్రాంగణమంతా జెండాలతో నింపేశారు. అనుకున్నంత స్థాయిలో జనాలు రాకపోవడంతో డ్రోన్ కెమెరాల్లో ఎక్కువ మంది వచ్చినట్లు చూపించేందుకు వాటిని పీకి పక్కన పడేశారు. చాలామంది సీఎం ప్రసంగం కాకుండానే వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సభకు తీసుకొచ్చిన వారిలో ఎక్కువగా ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులున్నారు. విజయనగరం ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు సాయంత్రం వేళ ఉపాధి పనులకు వెళుతుండగా.. వారిని కూడా అడ్డగించి, సభకు తీసుకెళ్లారు.
రహదారుల దిగ్బంధం
విజయనగరం- విశాఖ, చెల్లూరు- గొట్లాంకు వెళ్లే రెండు ప్రధాన రహదారులకు మధ్యలో వేదిక ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే వాహనాలు, ప్రయాణికులు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేదిక లోపలికి చరవాణులను అనుమతించలేదు.
బస్సులన్నీ ఖాళీ..
సభ కోసం ఏకంగా 1100 వరకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఒక్కో గ్రామానికీ రెండు, మూడు చొప్పున పంపించారు. అయితే చాలావరకు నిండలేదు. కొన్ని ఖాళీగానే చెల్లూరు చేరుకున్నాయి. గంట్యాడ మండలానికి వెళ్లిన బస్సుల్లో కొన్ని ఐదారుగురితోనే వచ్చేశాయి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఒక్కొక్క డివిజన్కు 5 నుంచి 10 బస్సులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 3 గంటలు దాటిన తర్వాత కూడా పలుచోట్ల కదల్లేదు. వాలంటీర్ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించారు.
అమలాపురం డిపో నుంచి వచ్చిన ఆరు బస్సులు విజయనగరం తోటపాలెం నాయుడుకాలనీలో నిలిపివేశారు. దగ్గర ప్రాంతాల్లోని ప్రయాణికుల కోసమైనా వీటిని వినియోగించాల్సిందని అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోల్ మాది.. ప్రచారం మీది
జగన్ సభకు కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించేందుకు నాయకులు పెట్రోల్ కూపన్లు అందజేశారు. వాటితో తమ వాహనాలకు పెట్రోలు కొట్టించుకునేందుకు అందరూ ఒక్కసారిగా రావడంతో చింతలవలస సమీపంలోని ఓ పెట్రోలు బంకు కిక్కిరిసిపోయింది.
న్యూస్టుడే, విజయనగరం గ్రామీణం
సాయంత్రం 4 గంటల వరకు..
మాది బొబ్బిలి మండలం పిరిడి గ్రామం, మా అమ్మాయి అత్తవారిది శ్రీకాకుళం జిల్లా కందివలస. అక్కడికి నా కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చాం. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్టాండులోనే పడిగాపులు కాశాం. అన్నీ సభలకు తరలిస్తే ఎలా.
రెడ్డి అప్పారావు, పిరిడి
అన్నీ సభకు తరలిస్తే ఎలా?
ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకు తీసుకెళ్లిపోతే ఎలా. మేము రామేశ్వరం యాత్ర ముగించుకుని వచ్చాం. చీపురుపల్లి సమీపంలోని మా గ్రామానికి వెళ్లడానికి విజయనగరం బస్టాండుకు వచ్చాం. రెండు గంటల పైగా ఉన్నా బస్సులు రాలేదు. వచ్చిన ఒక్క దాంట్లో ఎక్కడానికి వీలులేకుండా ఉంది.
ఎస్.రామచంద్ర, చీపురుపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూచోడి సర్వే మాయ
[ 06-05-2024]
అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్ చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. -
కర్కశ పాలనలో రక్కసి రోడ్లు
[ 06-05-2024]
ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. -
పునరావాసంలో జగన్మోసం
[ 06-05-2024]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. -
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న
[ 06-05-2024]
ఆశా కార్యకర్తల్లో వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. -
పాలవలస కుటుంబానికి చుక్కెదురు!
[ 06-05-2024]
వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్లు పొందారు. -
ప్రైవేటు ఉద్యోగులకు ఎన్నికల విధులు
[ 06-05-2024]
ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. -
రాక్షస పాలన వారంలో ముగుస్తుంది
[ 06-05-2024]
రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. -
చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత
[ 06-05-2024]
చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, -
ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం
[ 06-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు తెలుసునని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారట్ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్ చట్టం
[ 06-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్మోహన్రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్