వేదన వినండి
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు
- ఈనాడు, ఒంగోలు
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు
చక్రాల కుర్చీలో స్పందన భవన్కు వస్తున్న యాకూబ్
మర్రిపూడి మండలం యల్లంపల్లికి చెందిన యాకూబ్ బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంతో నడవలేని స్థితికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోరుతూ ఇప్పటికి పది దఫాలు స్పందనకు వచ్చి వినతులు అందించారు. తనకు వచ్చే పింఛనుతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, రేషన్ బియ్యమే ఆధారమన్నారు. తనకు సాయం కోరుతూ మరో దఫా వినతి ఇచ్చారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు కాశింపీరా, ఖాదర్బి. వీరిది కంభం మండలం కందులాపురం. 1994లో గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం కర్నాటక వలస వెళ్లారు. వీరు స్థానికంగా లేకపోవడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించేశాడని వీరు వాపోయారు. మండల అధికారులు, పోలీసులను కలిసి తమ సమస్యపై పలు దఫాలు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టర్ను కలిసి అర్జీ అందించారు.
ఏడాదిగా వేతనాలు లేవు
కలెక్టర్కు సమస్యలు వివరిస్తున్న ఎఫ్ఎన్ఓలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుద్ధ్య కార్మికులుగా, కాపలాదారులుగా, వైద్యులకు సహాయకులుగా (ఎఫ్ఎన్ఓలు) దాదాపు వందమంది పనిచేస్తున్నారు. ‘ఆప్కాస్’ కింద ఒప్పంద ఉద్యోగులుగా ప్రభుత్వం వీరిని నియమించింది. అందరికీ వ్యక్తిగత గుర్తింపు కార్డులూ మంజూరు చేశారు. 60 మందికి మాత్రమే ప్రతీ నెలా వేతనాలు వస్తున్నాయి. మిగిలిన 40 మందికి గత ఏడాదిగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలూ వీరి కుటుంబ సభ్యులకు వర్తించకుండా పోయాయి. కలెక్టర్ దినేష్కుమార్ను కలిసి వారంతా తమ గోడు విన్నవించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు సిరి.. నేడు ఉరి
[ 10-05-2024]
వ్యవసాయానికి గుండెకాయలాంటి సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి జగన్ అంతులేని నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా జిల్లాలోని పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. కొత్త ప్రాజెక్టులకు చిల్లిగవ్వ మంజూరు చేయకపోవడం..చెరువులు, కాలువల మరమ్మతులు విస్మరించడంతో అన్నదాత రోడ్డున పడ్డాడు. -
విష కౌగిలి.. ఊపిరే బిగపట్టి
[ 10-05-2024]
జగన్ అయిదేళ్ల రాజ్యంలో ఊరూరా వైకాపా నాయకుల అసుర గణం తయారైంది. అభివృద్ధి అనే మాటే మరిచింది. అరాచక పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ప్రత్యర్థులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకుంది. -
ఫ్యాన్ మీట నొక్కాలంటే వణుకు
[ 10-05-2024]
అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఇక పనేముందన్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర వేళ ఇచ్చిన హామీకి నిలువునా పాతరేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు ప్రారంభించారు. -
తెదేపా గెలుపుతోనే దర్శి వికాసం
[ 10-05-2024]
దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు. -
మర్యాదగా రాజీనామా చేయండి
[ 10-05-2024]
‘మర్యాదగా రాజీనామా చేయండి. రూ.5 వేలు నగదు బహుమతిగా పొందండి. ఇదే చివరి మీటింగ్. ఇన్ని రోజులు పార్టీ కోసం చేసింది ఒక లెక్క. రానున్న మూడు రోజులు చేసేది ఒక లెక్క. మీరు క్లస్టర్ స్థాయిలో తిరిగి, ఓటర్లకు తాయిలాలు పంచాలి. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 10-05-2024]
ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
పాలకుడి దెబ్బకు గ్రానైట్ పరిశ్రమ ఖాళీ
[ 10-05-2024]
చీమకుర్తి గ్రానైట్కు విశ్వవ్యాప్త ఖ్యాతి ఉంది. దీనికి సంబంధించిన వందలాది యూనిట్లు చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్, బూదవాడ, మర్రిచెట్లపాలెంలో నెలకొల్పారు. -
పెట్టెలో పోస్టల్ ఓటు
[ 10-05-2024]
పొరుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సాగింది. ప్రక్రియ ముగియడంతో సదరు బ్యాలెట్ పెట్టెలను జిల్లాల వారీగా విభజిస్తున్నారు. -
చెరువుల అభివృద్ధి ఒట్టి నీటి మాటే
[ 10-05-2024]
పొదిలి పెద్దచెరువు లోతట్టు విస్తీర్ణం 701.32 ఎకరాలు. దీని క్రింద అధికారికంగా 811 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. సుమారు 150 మంది వరకు రైతులు ఉన్నారు. పొదిలి చిన్నచెరువు విస్తీర్ణం 101 ఎకరాలు. -
రాళ్లవాగును అటకెక్కించావు.. జగనూ
[ 10-05-2024]
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు. -
సమష్టిగా పోరాటం చేయాలి
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం -
తెదేపాలో చేరిన వైకాపా సర్పంచి
[ 10-05-2024]
పులిపాడుతండా సర్పంచి జానవత్ లక్షీబాయ్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. దర్శి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్సాగర్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..