పోలవరం.. అన్యాయంపై నోరు మెదపరేం!
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
నిరసన దీక్షలో నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రాజెక్ట్ ఎత్తు 150 అడుగులకు బదులు 135కు తగ్గించాలని, 196 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి బదులు 92 టీఎంసీలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో రాష్ట్రానికి అన్యాయం చోటుచేసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడ్డుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ అంశంపై సీఎం జగన్ స్పందించి అడ్డుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని యథావిధిగా ఉంచి నిర్మాణం పూర్తి చేయాలని నినాదాలు చేశారు. దీక్షలో పార్టీ నాయకులు ఆర్.వెంకటరావు, పీవీఆర్.చౌదరి, పి.ప్రభాకరరావు, ఎం.రమేష్బాబు, పి.రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు సిరి.. నేడు ఉరి
[ 10-05-2024]
వ్యవసాయానికి గుండెకాయలాంటి సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి జగన్ అంతులేని నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా జిల్లాలోని పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. కొత్త ప్రాజెక్టులకు చిల్లిగవ్వ మంజూరు చేయకపోవడం..చెరువులు, కాలువల మరమ్మతులు విస్మరించడంతో అన్నదాత రోడ్డున పడ్డాడు. -
విష కౌగిలి.. ఊపిరే బిగపట్టి
[ 10-05-2024]
జగన్ అయిదేళ్ల రాజ్యంలో ఊరూరా వైకాపా నాయకుల అసుర గణం తయారైంది. అభివృద్ధి అనే మాటే మరిచింది. అరాచక పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ప్రత్యర్థులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకుంది. -
ఫ్యాన్ మీట నొక్కాలంటే వణుకు
[ 10-05-2024]
అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఇక పనేముందన్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర వేళ ఇచ్చిన హామీకి నిలువునా పాతరేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు ప్రారంభించారు. -
తెదేపా గెలుపుతోనే దర్శి వికాసం
[ 10-05-2024]
దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు. -
మర్యాదగా రాజీనామా చేయండి
[ 10-05-2024]
‘మర్యాదగా రాజీనామా చేయండి. రూ.5 వేలు నగదు బహుమతిగా పొందండి. ఇదే చివరి మీటింగ్. ఇన్ని రోజులు పార్టీ కోసం చేసింది ఒక లెక్క. రానున్న మూడు రోజులు చేసేది ఒక లెక్క. మీరు క్లస్టర్ స్థాయిలో తిరిగి, ఓటర్లకు తాయిలాలు పంచాలి. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 10-05-2024]
ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
పాలకుడి దెబ్బకు గ్రానైట్ పరిశ్రమ ఖాళీ
[ 10-05-2024]
చీమకుర్తి గ్రానైట్కు విశ్వవ్యాప్త ఖ్యాతి ఉంది. దీనికి సంబంధించిన వందలాది యూనిట్లు చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్, బూదవాడ, మర్రిచెట్లపాలెంలో నెలకొల్పారు. -
పెట్టెలో పోస్టల్ ఓటు
[ 10-05-2024]
పొరుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సాగింది. ప్రక్రియ ముగియడంతో సదరు బ్యాలెట్ పెట్టెలను జిల్లాల వారీగా విభజిస్తున్నారు. -
చెరువుల అభివృద్ధి ఒట్టి నీటి మాటే
[ 10-05-2024]
పొదిలి పెద్దచెరువు లోతట్టు విస్తీర్ణం 701.32 ఎకరాలు. దీని క్రింద అధికారికంగా 811 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. సుమారు 150 మంది వరకు రైతులు ఉన్నారు. పొదిలి చిన్నచెరువు విస్తీర్ణం 101 ఎకరాలు. -
రాళ్లవాగును అటకెక్కించావు.. జగనూ
[ 10-05-2024]
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు. -
సమష్టిగా పోరాటం చేయాలి
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం -
తెదేపాలో చేరిన వైకాపా సర్పంచి
[ 10-05-2024]
పులిపాడుతండా సర్పంచి జానవత్ లక్షీబాయ్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. దర్శి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్సాగర్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా