YSRCP: మూడో కృష్ణుడొచ్చారు
వైకాపా సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి తాజాగా నియమితులయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులిచ్చింది.
తొలుత బాలినేనికి ఉద్వాసన
ప్రస్తుతం సమన్వయకర్తలుగా బీదా, కరుణాకర్రెడ్డి
తాజాగా రంగంలోకి విజయసాయిరెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: వైకాపా సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి తాజాగా నియమితులయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులిచ్చింది. బాధ్యతలు స్వీకరించటమే తరువాయి. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న జిల్లా వైకాపాను విజయసాయిరెడ్డి సమన్వయం చేస్తారా అనే చర్చ సాగుతోంది.
కుమ్ములాటలు.. పోటాపోటీలు...: తొలుత ప్రాంతీయ సమన్వయకర్త హోదా నుంచి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. నెల్లూరు, చిత్తూరు, కడప బాధ్యతలు అప్పగించారు. మార్కాపురంలో సీఎం పర్యటనలో తలెత్తిన ప్రొటోకాల్ వివాదం తర్వాత ఆయన ఆ బాధ్యతల నుంచి కూడా వైదొలిగి కేవలం ఒంగోలు నియోజకవర్గం పైనే దృష్టి సారించి పనిచేస్తున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆ విధులు నెత్తికెత్తుకున్నప్పటికీ.. పార్టీలో లుకలుకలు, పలు నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి నూతన ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అనుబంధ విభాగాల పనితీరును కూడా పర్యవేక్షించారు. నిన్నామొన్నటి వరకు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూశారు. ఆ ప్రాంతానికి తానే సీఎం అన్నట్లుగా వ్యవహరించారు. పలు విమర్శలు, ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇప్పటికే అంతర్గత కుమ్ములాడుతున్న జిల్లాలోని అధికార పార్టీని ఆయన ఎలా సమన్వయం చేసి ఏకతాటిపై నడిపిస్తారో వేచిచూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురివింద దొడ్లో అధికార మంద
[ 28-04-2024]
నా కుమారుడు ప్రణీత్రెడ్డి అమాయకుడు. అతను రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షగట్టారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవే. -
30న వై.పాలేనికి చంద్రబాబు
[ 28-04-2024]
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న యర్రగొండపాలెం రానున్నారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్రసహాయకుడు
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ ఉంటే మాకేమిటి అన్నట్లుగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా రాజకీయ నాయకులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. -
పేదల ప్రాణం.. గాల్లో దీపం..
[ 28-04-2024]
వైద్యరంగానికి పెద్దపీట వేశానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా చెబుతుంటారు. అయితే ఇటు పీహెచ్సీలు, అటు ప్రధాన ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే దుర్భరంగా ఉంది. కానరాని వైద్య నిపుణులు..నామమాత్రంగా మందులు..మెరుగుపడని వసతులతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
వానొస్తే కుంట.. ఎండొస్తే కళ్ల మంట
[ 28-04-2024]
జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి పట్టణాలతో పాటు శ్రీశైలానికి వెళ్లాలంటే ఈ ఒంగోలు - కర్నూలు రోడ్డే గత్యంతరం. నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఈ బాటను ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యంగా వదిలేశారు. -
క్వార్టర్ మద్యం కోసం మట్టుబెట్టాడు
[ 28-04-2024]
క్వార్టర్ మద్యం కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన యర్రగొండపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. 24 గంటల్లో పోలీసులు ఈ కేసులు ఛేదించారు. -
వైకాపా ప్రచారంలో ఉద్యోగులు
[ 28-04-2024]
గత మంగళవారం దర్శి మండలం చందలూరులో అధికార వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ చవలం రామాంజనేయులు, వాలంటీరు సింగంశెట్టి సతీష్లు పాల్గొన్నారు. -
శిద్దా ఇంట్లో దోపిడీకి విఫలయత్నం
[ 28-04-2024]
మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫలయత్నం జరిగింది. అదనపు ఎస్పీ(క్రైమ్స్) ఎస్.వి.శ్రీధర్రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. -
‘నా.. నా’లుక వరకే మీరు
[ 28-04-2024]
‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా మాటలు చెప్పే జగన్.. చేతల్లో ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని వేదికలపై పలుకుతూ.. తన అయిదేళ్ల పాలనలో వారి బతుకులనే సంక్షోభంలో పడేశారు. -
గొంతెండుతున్న పల్లెలు
[ 28-04-2024]
నీటి ఎద్దడితో పల్లెల గొంతెండుతోంది. మండలంలోని పామూరిపల్లె, బాదినేనిపల్లె ఎస్సీ కాలనీ, హనుమంతరాయునిపల్లె గ్రామాల్లో నీటికి కటకటలాడుతున్నారు. పామూరిపల్లె ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా ట్యాంకు వాల్వు మరమ్మతులకు గురికావడంతో నీరు ఎక్కక నీరంతా వృథా అవుతోంది. -
ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
తర్లుపాడు మండలంలో తుమ్మలచెరువులో శనివారం కందు నారాయణరెడ్డి ప్రచారం చేట్టారు. ప్రచారరథంపై రెండు రోజులుగా తర్లుపాడు మండలంలో పర్యటిస్తున్నారు. -
నాడు ప్రగతి... నేడు ఆధోగతి
[ 28-04-2024]
ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారు. -
గుండ్లకమ్మలో ఇసుక తోడేళ్లు
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైకాపా నాయకుల ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. పైపెచ్చు... గుండ్లకమ్మ పరిధిలో యంత్రాలతో మరింతగా తోడేస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నా... అటుగా వెళ్లి హెచ్చించిన దాఖాలాలు సైతం లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!