Balineni: చెల్లుబాటు కాని బాలినేని మాట.. కింకర్తవ్యం!
అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట చెల్లుబాటు కాకుండా పోయింది. ఆయన ప్రతిపాదనలను వైకాపా అధిష్ఠానం తోసిపుచ్చింది.
ప్రకాశం సమన్వయకర్తగా చెవిరెడ్డి
మళ్లీ అలకబూనిన మాజీ మంత్రి
భవిష్యత్తుపై కుటుంబీకులతో చర్చ
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట చెల్లుబాటు కాకుండా పోయింది. ఆయన ప్రతిపాదనలను వైకాపా అధిష్ఠానం తోసిపుచ్చింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ స్థానం కేటాయించేది లేనేలేదని ఖరాఖండిగా తేల్చేసింది. ఆయనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రతిపాదనను అంగీకరించకుంది. మాగుంట కాకుంటే కనీసం తన కుమారుడు ప్రణీత్రెడ్డినైనా పరిగణనలోకి తీసుకోవాలని చేసిన ప్రతిపాదననూ సమ్మతించకుంది. అదే సమయంలో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పోటీ చేస్తారని చెప్పింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త బాధ్యతలను కూడా ఆయనకే కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో బాలినేనికి పరాభవం ఎదురైనట్లైంది. ఇదే మీ నిర్ణయమైతే నా దారి నేను చూసుకుంటానంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ను బుజ్జగించే యత్నం చేసినా వినలేదు. భవిష్యత్తు కార్యాచరణపై కుటుంబీకులతో సమాలోచనలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది.
- స్థానికేతరుల వైపే మొగ్గు...: ఒంగోలు పార్లమెంట్ స్థానం వైకాపా అధిష్ఠానికి చిక్కుముడిగా మారింది. బాలినేని ఎంతగా పట్టుబట్టినా మాగుంటకు అవకాశం ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇళ్లస్థలాలకు నిధుల మంజూరుతో ఆయన కాస్తంత మెత్తబడినట్లు కనిపించినా, ఆ వెంటనే స్వరం మార్చారు. మాగుంట కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మంత్రి ఆర్కే రోజా పేర్లు తెర మీదకు వచ్చాయి. స్థానికేతరులంటూ వారి అభ్యర్థిత్వం పట్ల బాలినేని విముఖత ప్రదర్శించారు. మాగుంటను కాదనుకుంటే తన కుమారుడు ప్రణీత్రెడ్డికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. అందుకు అంగీకరించని అధిష్ఠానం మాత్రం స్థానికేతరుల వైపే మొగ్గు చూపింది. చెవిరెడ్డి పేరునే దాదాపు ఖరారు చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని బాలినేని ఆ పార్టీ పెద్దలకు వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది.
- చేసేది లేక వెనుదిరిగిన సజ్జల...: పార్టీ అధిష్ఠానం వైఖరితో అలకబూనిన బాలినేని తాడేపల్లి ప్యాలెస్ నుంచి నేరుగా విజయవాడ వెళ్లారు. బందరు రోడ్డులోని ఓ హోటల్లో తన అంతరంగీకులతో సమాలోచనలు చేపట్టారు. బాలినేని మరోసారి అలకబూనిన విషయం తెలుసుకున్న అధిష్ఠానం సలహాదారు సజ్జలని రంగంలోకి దింపింది. ఆయన నేరుగా హోటల్ వద్దకు వెళ్లి సుమారు గంటన్నరసేపు బుజ్జగింపులు చేపట్టారు. పార్టీలో మీ ప్రాధాన్యానికి ఢోకా లేదని హామీ ఇచ్చినప్పటికీ బాలినేని శాంతించలేదని సమాచారం. సాయంత్రం మూడు గంటలకు సీఎంతో భేటీకి అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ సీఎంవోకు వెళ్లకుండా మాగుంట సీటు విషయం తేల్చాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. బుజ్జగించినా ప్రయోజనం లేకపోవటంతో చేసేదేమీ లేక సజ్జల వెనుదిరిగారు.
- ఏం చేద్దామంటూ సమాలోచనలు...: మాగుంటకు టికెట్ కేటాయించలేమంటూ స్పష్టం చేయడం.. ప్రతిపాదనలను కనీసం ఖాతరు చేయకపోవడంతో బాలినేని తన కుమారుడు ప్రణీత్రెడ్డి, వియ్యంకుడు భాస్కర్రెడ్డిలతో హోటల్లో సమావేశమై భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. బాలినేని నిర్ణయం కోసం అనుచరులు ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆయన మాగుంటతో కలిసి తెదేపాలోకి వెళ్లే అవకాశం ఉందని, లేదంటే షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్లోకి వెళ్లడాన్నీ కొట్టి పారేయలేమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
- షర్మిల విమర్శించనందుకేనా..!: మాగుంట విషయం ప్రస్తావించొద్దు అని వైకాపా అధిష్ఠానం పది రోజుల క్రితమే బాలినేనికి సూటిగా చెప్పేసింది. ఆ తర్వాతే ఇళ్ల స్థలాలకు భూ సేకరణ నిమిత్తం నిధులు మంజూరు చేసింది. అప్పటికి 42 రోజులుగా ఒంగోలుకు దూరంగా ఉన్న బాలినేని విజయోత్సవం పేరుతో ఒంగోలులో బల ప్రదర్శన నిర్వహించారు. ఇక మాగుంట జోడీ లేకపోయినా ఆయన ఒంగోలు నుంచే బరిలో ఉంటారని అంతా భావించారు. ఇంతలోనే ఒక్కసారిగా కథ మారిపోయింది. ఈ నెల 27న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆమె.. అదే సమయంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేనిలను మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఈ అంశం కూడా వైకాపా వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే వైకాపా అధిష్ఠానం బాలినేని మాటలను పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?