Balineni: వద్దు చెవిరెడ్డి.. నేనే ఎంపీ: వ్యూహం మార్చిన బాలినేని
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహం మార్చినట్లు తెలిసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానంటూ తాడేపల్లి ప్యాలెస్కు సంకేతాలు పంపినట్లు సమాచారం.
తాడేపల్లి ప్యాలెస్కు ప్రతిపాదన
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహం మార్చినట్లు తెలిసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానంటూ తాడేపల్లి ప్యాలెస్కు సంకేతాలు పంపినట్లు సమాచారం. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని వైకాపా అధిష్ఠానం జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ నిర్ణయంపై బాలినేని అలకబూనారు. అనంతరం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కీలక అనుచరులతో సమాలోచనలు సాగిస్తున్నారు. జిల్లాపై తన పట్టును పోగొట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని భావిస్తున్నారని.. ఈ క్రమంలోనే చెవిరెడ్డిని తెర పైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు తానే పార్లమెంట్ బరిలో నిలవాలనే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది.
చంద్రగిరికి చెక్ పెట్టే వ్యూహం: జిల్లా వైకాపా రాజకీయం ఇప్పటి వరకు బాలినేని చుట్టూ పరిభ్రమిస్తోంది. అధిష్ఠానం మాత్రం ఆయన ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి కోసం బాలినేని పట్టుబట్టడంతో అది కుదిరే పనికాదని ఇప్పటికే తాడేపల్లి తేల్చిచెప్పింది. ఆయన స్థానంలో చెవిరెడ్డిని ప్రతిపాదించింది. అంతటితో ఆగకుండా ఆయన్ను ప్రాంతీయ సమన్వయకర్తగానూ నియమించింది. దీంతో కంగుతిన్న మాజీ మంత్రి.. మరోసారి అలకబూని హైదరాబాద్ వెళ్లారు. జిల్లాలో చెవిరెడ్డి అడుగు పెడితే ఇన్నాళ్లుగా సాగిన తన ప్రభ అడుగంటిపోతుందని శ్రీనివాసరెడ్డి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
ఇటు భేటీలు.. అటు పరుగులు: ఇదిలా ఉంటే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి బాలినేనితో భేటీ అయ్యారు. అంతకుముందు గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రితో శుక్రవారం సాయంత్రం ఆయన భేటీ అయ్యారు. అనంతరం బయుదేరి హైదరాబాద్ వెళ్లి రాత్రి సుమారు 11.15 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు బాలినేనితో సమాలోచనలు సాగించారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించి అభ్యర్థులకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. చెవిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఆయన తన కీలక అనుచరులతో మరోసారి భేటీ అయ్యారని.. జిల్లాపై పట్టు సాధించే యోచనలో ఉన్న చెవిరెడ్డికి చెక్ చెప్పాలంటే తాను ఎంపీగా పోటీ చేయడం ఒక్కటే మార్గమని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ద్వారా తాడేపల్లి ప్యాలెస్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా సమన్వయకర్తగా వస్తూనే చెవిరెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జేసీ, ఎస్పీల బదిలీల్లో ఇప్పటికే చక్రం తిప్పారు. ఈ పరిణామాలతో మాజీ మంత్రి అనుచరులు కంగుతిన్నారు. ఇంకా ఉపేక్షిస్తూ కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని భావించారు. ఈ క్రమంలోనే బాలినేని తన వ్యూహాన్ని మార్చారు. తొలుత తన తనయుడు ప్రణీత్ రెడ్డిని ప్రతిపాదించినప్పటికీ.. ఇప్పుడు తానే ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలను అధిష్ఠానానికి పంపారనే చర్చ సాగుతోంది.
కుందురుకు స్థానికేతర చిక్కు...
మార్కాపురం నుంచి గిద్దలూరుకు బదిలీపై వెళ్లిన కందురు నాగార్జునరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. నియోజకవవర్గ మార్పుపై నాగార్జునరెడ్డి మొదటి నుంచీ అయిష్టంగానే ఉన్నారు. అధిష్ఠానం నచ్చజెప్పడంతో విధి లేక వెళ్లారు. ఇప్పటికే గిద్దలూరు టికెట్ను ఆశించి భంగపడిన ఆశావహులు స్థానికేతర అంశాన్ని ఇప్పుడు బలంగా లేవనెత్తుతున్నారు. కుందురు హయాంలో మార్కాపురంలో చోటుచేసుకున్న భూ అవినీతి, అక్రమాలపై కూడా గళమెత్తాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొందరు నాయకులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ