ఆనందం.. అంతలోనే విషాదం
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో వధువు తల్లి, ఇద్దరు బంధువుల దుర్మరణం
కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు
టంగుటూరు, న్యూస్టుడే: కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారి సంతోషం చూసి విధికి కన్నుకుట్టిందేమోగాని, కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముగ్గురిని కబళించింది. దీంతో పెళ్లి కుమార్తె ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం శివారున 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వధువు తల్లి, మేనమామ భార్య, పిన్ని కూతురు దుర్మరణం పాలవగా.. వధువు సోదరుడు, మేనమామ, మేనమామ కుమారులు గాయాలపాలయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన రాయని అరుణ కుమార్తెకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తపాల్వంచకు చెందిన యువకుడితో సంబంధం కుదిరింది. బుధవారం రాత్రి 9 గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహమైంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు బస్సుల్లో హాజరయ్యారు. అనంతరం వధువు తరఫున బంధువులంతా ఆయా వాహనాల్లో కందుకూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. వధువు తల్లి అరుణ, సోదరుడు వేణు, మేనమామ తలపునేని వినోద్, ఆయన భార్య దివ్య, వారి కుమారుడు రామ్, పిన్ని కూతురు గుళ్లాపల్లి శ్రావణిలు కారులో బయలుదేరారు. గురువారం ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు తూర్పునాయుడుపాలెం వద్దకు వచ్చేసరికి వాహనం నడుపుతున్న వినోద్ నిద్రలోకి జారుకోవడంతో పక్కనే రోడ్డు అంచున ఉన్న ఫెన్సింగ్ సిమెంట్ దిమ్మెలను వేగంగా ఢీకొంది. ఈ క్రమంలో కారు పల్టీలు కొడుతూ రెండు దిమ్మెలను ఢీకొట్టి మరో దిమ్మెకు తగిలి ఆగింది. దీంతో వాహనం మొత్తం నుజ్జయింది. రాయని అరుణ(50), తలపనేని దివ్య(30), గుళ్లాపల్లి శ్రావణి (22)ల తలలకు తీవ్ర గాయాలు కావడంతో కారులోనే మృతిచెందారు. రాయని వేణు (27), తలపనేని వినోద్(35)లకు తీవ్ర గాయాలుకాగా.. చిన్నారి రామ్ (3)కు చిన్నపాటి గాయాలై ప్రాణాలతో బయటపడ్డారు. బస్సుల్లో వస్తున్న బంధువులు సంఘటనా స్థలం వద్ద ఆగారు. విగతజీవులుగా పడిఉన్న వారిని చూసి విలపించారు.
క్షతగాత్రుల హాహాకారాలు..
వేగంగా వెళ్తున్న కారు పల్టీలు కొట్టడంతో భారీ శబ్దం వచ్చిందని, లోపల ఉన్నవారు హాహాకారాలు చేశారని ఘటన చూసిన వాహన చోదకులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన కొందరు వాహన చోదకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న టంగుటూరు ఎస్సై నాగేశ్వరరావు, సింగరాయకొండ సీఐ రంగనాథ్, అగ్నిమాపక, జాతీయ రహదారి భద్రత, పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో ప్రాణాలతో ఉన్న వారిని బయటకు తీసి 108 వాహనం ద్వారా ఒంగోలు రిమ్స్కు తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాద స్థలానికి ఒంగోలు డీఎస్పీ కిషోర్ కుమార్ చేరుకొని జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కి తరలించారు.
ప్రమాదంలో నుజ్జయిన కారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు