దేవుడా.. నీ భూములనూ వదల్లేదు..!
పశ్చిమ ప్రకాశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల మాన్యం భూములు ఈ అయిదేళ్ల వైకాపా పాలనలో ఆక్రమణల పాలయ్యాయి. అంతకు ముందు కొంత భూమినే ఆక్రమించుకున్న అక్రమార్కులకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరీ అడ్డూ అదుపు లేకుండా పోయింది.
అయిదేళ్లలో చెలరేగిన వైకాపా నాయకులు
అడ్డూ అదుపు లేకుండా ఆక్రమణలు
ధూప, దీప నైవేద్యానికి ఇబ్బందులు
పొదిలమ్మ దేవాలయం ముందు వెలిసిన గృహాలు
మార్కాపురం, పొదిలి, న్యూస్టుడే: పశ్చిమ ప్రకాశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల మాన్యం భూములు ఈ అయిదేళ్ల వైకాపా పాలనలో ఆక్రమణల పాలయ్యాయి. అంతకు ముందు కొంత భూమినే ఆక్రమించుకున్న అక్రమార్కులకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరీ అడ్డూ అదుపు లేకుండా పోయింది. మార్కాపురం పట్టణం, మండల పరిధిలోని గ్రామాల పరిధిలో ఉన్న చెన్నకేశవుడి భజంత్రీలకు సంబంధించిన మాన్యం భూమికి ఆక్రమణదారులు శఠగోపం పెట్టారు. అధికారపార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఆక్రమణదారులు ఏకంగా ఆక్రమించుకొని స్వాధీనం చేసుకున్నారు. రూ కోట్లు విలువైన మాన్యం భూమిని ఆక్రమించుకోవడం ఆ తర్వాత ఆ భూమి మాది, అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో వివాదం ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్నాయి.్ర మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానానికి ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ రికార్డుల ప్రకారం ఈ దేవాలయానికి అన్ని చోట్లా సర్వీసుల ఇనాంకు చెందిన దేవస్థానం భూమి 269.55 ఉండేది. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన భూమి కేవలం 58.23 ఎకరాలు మాత్రమే ఉంది. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆక్రమణలు ఎంత జరిగాయో.్ర కొనకనమిట్ల మండలంలోని అంబాపురం గ్రామంలో శివాలయానికి చెందిన మాన్యం భూమి 91.29 ఎకరాలు ఉంది. అయితే ఈ భూమిని కౌలుకు పెట్టకుండా గ్రామానికి చెందిన పెద్దల ముసుగులో అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నల్లో భూమి మొత్తం ఉంది. వారే సాగు చేసుకోని స్వామి వారికి దూప, దీప నైవేద్యం చేయకుండా స్వామి వారి భూమిని అనుభవిస్తున్నారు. ్ర పొదిలిలోని పొదిలమ్మ, పోలేరమ్మ దేవాలయం భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ అయిదేళ్లకాలంలో ఆక్రమణలు పెరిగాయి. ప్రభుత్వం ఆక్రమణలను నిలువరించడంలో విఫలమవడంతో క్రమంగా ఆక్రమణలు పెరుగుతున్నాయి. చిన్నబస్టాండ్ సమీపంలోని పోలేరమ్మ దేవాలయం చుట్టూ కూడ ఆక్రమణలు వెలిశాయి. ప్రస్తుతం దేవాలయానికి లోపలికి వెళ్లేందుకు సరైన దారి కూడ లేకుండా చుట్టూ దుకాణాలు వెలిశాయి.
బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం
వైకాపా ప్రభుత్వం 2019 నుంచి 024 వరకు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ఒక్క పథకం ప్రవేశపెట్టలేదు. కనీసం ఉన్న పథకాలను కూడా నిలిపివేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దేవాదాయాధర్మాదాయశాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో పూజారులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పూజారుకు నెలకు రూ.5 వేల వేతనం అందజేస్తున్నారు. ఈ వేతనంలో కూడా రూ.2500 పూజా సమాగ్రికి ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వేతనం ఇవ్వాలి
దేవాదాయధర్మాదాయశాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రామాలయం వంటి దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు కనీస వేతనం ఇవ్వాలి. నెలకు గౌరవ వేతనం కింద రూ.5 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. ఈ వేతనంలో సగం పూజ సామగ్రికి ఖర్చు అయిపోతుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క రూపాయి గౌరవ వేతనం పెంపుదల చేయలేదు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం రూ.18,500 ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నా.
దామసాని ప్రశాంత్శర్మ, రామాలయం పూజారి, వేములకోట
పూర్తిగా ఆగిపోయాయి
పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ను అమలు చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కింది. ఆయన ఏర్పాటు చేసిన కార్పొరేషన్ను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిధులు లేకుండా నిర్వీర్యం చేశారు. ప్రతి ఏడాదికి బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని గొప్పలు చెప్పింది. కనీసం ఒక్క రూపాయి విదల్చలేదు. బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిన పథకాలన్నీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయాయి.
ఓరుగంటి మల్లిక్, బ్రాహ్మణ సంఘం నాయకుడు, మార్కాపురం
రుణం అందలేదు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పేద బ్రాహ్మణుడికి కార్పొరేషన్ ద్వారా రుణం అందలేదు. రాయితీ రుణాలు ఊసే లేకుండా పోయింది. బ్రాహ్మణకార్పొరేషన్కార్యాలయం కూడా తాళం వేసే పరిస్థితికి వచ్చింది. నిధులు లేని కార్యాలయంలో ఛైర్మన్లు, డైరెక్టర్లు ఎందుకు పని చేస్తారు. కనీసం వారికి నిధులు ఇవ్వకుండా ఏవిధంగా కార్పొరేషన్ను నడుపుతారు. బ్రాహ్మణులపై దాడులు జరిగాయి ప్రభుత్వం ఒక్క చర్య తీసుకోలేదు. కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు.
మేడవరం మల్లికార్జునశర్మ, బ్రాహ్మణ సేవా సంఘం నాయకుడు, మార్కాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ