వైభవంగా సీతారాముల కల్యాణం
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మార్కాపురం పట్టణం: సీతారాముల కల్యాణంలో పాల్గొన్న భక్తులు
పొదిలి, పొదిలిగ్రామీణం, మార్కాపురం పట్టణం, గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, కొమరోలు గ్రామీణం, త్రిపురాంతకం గ్రామీణం, యర్రగొండపాలెం: రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
- పొదిలిలోని కొత్తూరు, పాతూరులోని రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలో సీతారాముల కల్యాణం జరిపించారు.
- మార్కాపురంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం, రామాలయాల్లో ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
- గిద్దలూరులోని సీతారాముల కల్యాణమండపంలో నిర్వహించినకల్యాణోత్సవంలో ముత్తుముల అశోక్రెడ్డి దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి దంపతులు పాల్గొన్నారు.
- బేస్తవారపేట, కొమరోలు, రాచర్ల, కంభం, పెద్దదోర్నాల మండలంలోని రామాలయాల్లో కల్యాణ కృతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవతా వస్త్రాల అలంకరణతో చిన్నారులు ప్రదర్శన భక్తులను అలరించాయి.
- త్రిపురాంతకంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీతారాముల స్వాముల శోభాయాత్రను గ్రామంలో నిర్వహించారు.
- వై.పాలెం పట్టణం పడమటి బజారులోని రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది.
- యర్రగొండపాలెంలోని బంగారు దుకాణాల బజారులో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కంభం మండలంలోని తురిమెళ్లలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి బుధవారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
పొదిలిలో భక్తులకు అన్నదానం
వై.పాలెంలో...
త్రిపురాంతకం గ్రామీణం: శ్రీరాముని శోభాయాత్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది