‘కోతల’రాయుడు
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు.
ఇంటింటా సంక్షేమమంటూ కబుర్లు
ఉత్తుత్తి బటన్లు నొక్కి సంబరాలు
నెలలుగా ఖాతాలకు జమ కాని నగదు
ఎన్నికల ముంగిట మరో జగ‘న్నాటకం’
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. ఆరంచెలు అంటూ ఏటికేటికీ ఒక్కో పథకాన్ని నీరుగార్చారు. లబ్ధిదారుల సంఖ్యనూ గణనీయంగా తగ్గించారు. గతంలో లబ్ధి అందుకున్న వారినీ దూరం చేశారు. సరాసరిన నెలకు 300 యూనిట్ల విద్యుత్తు వాడకం, పింఛను, నాలుగు చక్రాల వాహనం ఉన్నా కోతలతో వాతలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ముగింట వాగ్దానాలను అమలు చేస్తున్నామంటూ బహిరంగ సభలు పెట్టి ఆర్భాటంగా బటన్లు నొక్కారు. అందుకు సంబంధించి నెలలైనా ఖాతాలకు ఇంకా నగదు జమ కాలేదు. దీంతో ఉత్తుత్తి బటన్లు నొక్కి సీఎం తమను మోసం చేశారని.. ఎన్నికల వేళ ఇది మరో జగన్నాటకమంటూ మహిళలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ మహిళలకు మోసం
పథకం పేరు: వైఎస్సార్ చేయూత
జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు: 98,848 మంది
ప్రకటించిన ఆర్థిక లబ్ధి: రూ.185.34 కోట్ల మేర
బటన్ నొక్కింది: మార్చి 7వ తేదీ
క్షేత్రస్థాయిలో పరిస్థితి: నెల రోజులు దాటినా ఇంకా 70 శాతం మహిళల ఖాతాలకు నగదు జమ కాలేదు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ మహిళల్లో 50 శాతం మందికే జమ అవగా, బీసీ, మైనార్టీలకు వారికి ఊసే లేదు. వైఎస్సార్ చేయూత కింద ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ మహిళల్లో 50 శాతం మందికే నగదు జమైంది. బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు ఇంకా నగదు జమ కాలేదు. పలువురు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నగదు జమ కాకపోవడంతో ఈసురోమంటూ వెనుదిరిగి వెళ్తున్నారు. ఉత్తుత్తి బటన్ నొక్కి జగన్ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేస్తమంటూ ఈబీసీలకు ద్రోహం...
పథకం పేరు: వైఎస్సార్ ఈబీసీ నేస్తం
జిల్లాలోని లబ్ధిదారులు: 38,001 మంది
ప్రకటించిన ఆర్థిక ప్రయోజనం: రూ.57.కోట్లు
చివరి విడత నగదు విడుదల: గత నెల 14
తాజా పరిస్థితి: నెల రోజులు గడిచినప్పటికీ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోఒక్కరికి కూడా నగదు జమ కాలేదు. ఈబీసీ నేస్తం పథకానికి 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు అగ్రకులాల మహిళలు అర్హులు. వీరిలో జీవన ప్రమాణాలను మరింత మెరుగు పరచడంతో పాటు, ఆర్థికంగా సాధికారత సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం వారికి రూ.15 వేలు చొప్పున వరుసగా నాలుగు సంవత్సరాలు తోడ్పాటు అందించనున్నట్లు వైకాపా ప్రభుత్వం ప్రచారం చేసింది. నెల రోజులు దాటినా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోఒక్కరికి కూడా నగదు జమ కాకుండటంతో వారంతా ఈసురోమంటున్నారు.
ఆసరా ఇచ్చేది ఇలాగేనా!
పథకం పేరు: వైఎస్సార్ ఆసరా
మొత్తం స్వయం సహాయక సంఘాలు: 36,769
అందులోని సభ్యులు: 3,59,506 మంది
జమ కావాల్సిన నిధులు: రూ. 50 కోట్లు
బటన్ నొక్కింది: జనవరి 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ నాలుగో విడత నగదు జమంటూ బటన్ నొక్కారు.
సంబరాలంటూ నాటకాలు: ఆ తర్వాత ఆసరా సంబరాల పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కార్యక్రమాలు చేపట్టారు. మహిళలను బలవంతంగా తరలించి సభలు ఏర్పాటు చేశారు. ప్రదర్శనలు నిర్వహించారు.
వాస్తవ పరిస్థితి: బటన్ నొక్కి మూడు నెలలవుతున్నా ఇంకా ఎక్కువ సంఘాలకు నగదు జమ కాలేదు. సదరు మహిళలు బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు 2019 ఏప్రిల్ 11 నాటికి తీసుకుని బకాయి ఉన్న బ్యాంక్ లింకేజీ రుణాలను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో రుణ మాఫీ చేస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నాలుగో విడత కింద రూ.280.50 కోట్ల నగదును బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలి. గత మూడేళ్లుగా మూడు విడతల్లో కొంత జమ చేయగా, నాలుగో విడత అమలుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. అందులో ఓసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు సంబంధించి మరో రూ.50 కోట్ల మేర నిధులు జమ కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం