వీధిన పడ్డ బతుకులు
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది.
అయిదేళ్ల పాలనలో యువకులు విలవిల
జీవనం అస్తవ్యస్తం
తర్లుపాడు, న్యూస్టుడే : ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. పని చేసుకునే వాడికి పని దొరకదు. చదువుకున్న యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. కార్మికులకు పనులు లేక వలసబాట పడుతున్నారు. అటు సంపాదన లేక ఇటు ఉపాధి లేక యువత విలవిలలాడుతోంది.
ఉపాధి కోల్పోయా.. : జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే భవన నిర్మాణ విభాగంపై కక్ష కట్టి ఇసుక దొరకుండా చేశారు. మా తల్లిదండ్రులు చదివించే స్థోమత లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పని నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి బెల్దారి పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడిని. కానీ వైకాపా వచ్చిన తర్వాత ఇసుక లేకుండా చేయడంతో భవన నిర్మాణం పూర్తిగా నిలిచిపోయి మాలాంటి వారికి ఉపాధి లేకుండా పోయింది. ఇతర పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది.
ఈర్ల గోపి, భవన నిర్మాణ కార్మికుడు, తర్లుపాడు బీసీ కాలనీ
డిగ్రీ పూర్తిచేసినా ఉపయోగమేదీ? : మాది పేద కుటుంబం. మా తల్లిదండ్రులు వసల కూలీలు. పనులు చేసుకుంటూ నన్ను చదివించారు. అప్పులు చేసి నన్ను చదివిస్తే డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు అవుతున్నా ఉద్యోగమేదీ రాలేదు. జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏవీ రాలేదు. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇస్తుందోమోనని శిక్షణ తరగతులకు వెళ్తే నేటికీ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నిరుద్యోగిగా తల్లిదండ్రులకు భారంగా మారాను.
పెద్ద తిరుపతయ్య, నిరుద్యోగ యువకుడు, తర్లుపాడు
బిందు సేద్యం లేక.. ఇబ్బంది : పశ్చిమ ప్రకాశం వర్షాధారిత ప్రాంతం. ఇక్కడ నిత్యం వర్షాలు కురిస్తేనే పంటలు పండేది అంతంత మాత్రమే. బోర్లు వేస్తే వందల అడుగుల లోతుకు తవ్వితే గానీ నీళ్లు బయటకు రావు. ఇలాంటి ప్రాంతానికి గత తెదేపా ప్రభుత్వం 90 శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు ఇవ్వడంతో ఫిట్టర్గా మాలాంటి యువకులకు నిత్యం పని ఉండేది. సూక్ష్మసేద్యం వల్ల రైతులకు నీటి ఇబ్బందులతో పాటు స్థానిక యువతకు ఉపాధి ఉండేది. కానీ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అయిదేళ్లలో సక్రమంగా డ్రిప్ పైపులు ఇవ్వకపోవడంతో రైతులకు పంట నష్టాలతో పాటు మాలాంటి వారు ఉపాధిని కోల్పోయి ఏ పని చేయలేకున్నాం.
రాజారపు గురవయ్య, డ్రిప్ ఫిట్టర్, మీర్జాపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికే ‘ఇంటి’కి పట్టిన శని
[ 02-05-2024]
సీఎం జగన్ చెప్పే కట్టుకథలకు జగనన్న కాలనీలే నిలువెత్తు నిదర్శనం. ఇళ్లు కాదు ఊళ్లంటూ మైకులు పగిలేలా అరిచి చెప్పారు. రొచ్చుగుంతలు, రాళ్లగుట్టలు, శ్మశానాల చెంత, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు సేకరించారు. -
వైకాపా మద్యమా.. మాకేం కనిపించదు
[ 02-05-2024]
‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం.. -
సార్వత్రిక రణం.. హోరెత్తుతున్న ప్రచారం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు. -
అధికారాంతమునా అరాచకం
[ 02-05-2024]
ఎన్నికల వేళా వైకాపాలోని భూ బకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. విలువైన భూములపై కన్నేస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే వాటిలో పాగా వేసేందుకు తహతహలాడుతున్నారు. -
అయిదేళ్లలో కుమ్ముడు
[ 02-05-2024]
గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు. -
జల‘కల’ భగ్నం
[ 02-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు చెందిన పంట పొలాల్లో ఉచితంగా అమర్చాలన్నదే పథకం ఉద్దేశం. -
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సీట్లూ వదలొద్దు
[ 02-05-2024]
ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేపట్టకుండా పటిష్ఠ నిఘా అవసరమని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్ సూచించారు. -
నిరుద్యోగ యువత వేసే మార్కులు సున్నా
[ 02-05-2024]
ప్రోగ్రెస్ కార్డు మీ ముందుంచుతున్నాను.. మార్కులు మీరే వేయాలంటూ పదే పదే చెబుతున్న సీఎం జగన్కు నిరుద్యోగ యువతగా తామిచ్చేది సున్నా అని పాదయాత్ర బృందం సభ్యులు ఎద్దేవా చేశారు. -
జై చెన్నకేశవా.. జైజై చెన్నకేశవా
[ 02-05-2024]
నాలుగు యుగాల దేవుడిగా భక్తుల నుంచి పూజలందుకునే మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. -
ఓటమి భయం.. తపాలా ఓట్లకు గాలం
[ 02-05-2024]
ఓటమి భయం వైకాపాను వెంటాడుతోంది. ఉద్యోగుల్లో ఆ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉండటం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. దీంతో ప్రలోభాల పరంపరను మరింత ముమ్మరం చేసింది. తమ నాయకుల ద్వారా ఆ పార్టీలోని కొందరు అనుకూల ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఇతరుల ఓట్లకు గాలం వేస్తోంది. -
కబ్జా చెరలో చారిత్రక దుర్గం
[ 02-05-2024]
చారిత్రక కనిగిరి దుర్గానికీ దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. నాటి రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కోటను, కొండరాళ్లను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. -
వైకాపా నేత అయినాబత్తిన తెదేపాలో చేరిక
[ 02-05-2024]
ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ తెదేపాలో చేరారు. -
పన్ను పెంపు.. బాదుడే బాదుడు
[ 02-05-2024]
ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది. -
వైకాపా దర్శి అభ్యర్థి ఎదుటే బాహాబాహీ
[ 02-05-2024]
వర్గ విబేధాలు వైకాపాను వీడటం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు వేరు కుంపట్లుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకోవడంతో పాటు ఏదేని సందర్భం వస్తే గిట్టని వారిపై దాడులకూ తెగబడుతున్నారు. -
కార్మికుల పనివేళలు రీ షెడ్యూల్ చేయాలి
[ 02-05-2024]
జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలులు అధికంగా ఉన్నందున వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పనివేళలను రీ షెడ్యూల్ చేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా