నగదు చోరీలో ఇంటి దొంగలు
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు.
స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, పోలీసులు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలేనికి చెందిన సన్నమూరి మహేష్, రాచర్ల రాజశేఖర్ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు వివరించారు. ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న సీఎంఎస్ సంస్థ ఒంగోలు బ్రాంచి మేనేజర్ గుజ్జుల పెదకొండారెడ్డి ప్రమేయంతోనే తాము ఈ నేరానికి పాల్పడినట్లు ప్రధాన నిందితుడు విచారణలో తెలిపాడన్నారు. ఈ మేరకు అతన్ని కూడా నిందితుడిగా చేర్చి విచారిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు మహేష్ గతంలో సీఎంఎస్లో పనిచేసి మానేశాడని, ఏటీఎంలలో నింపేందుకు నగదు తరలించే క్రమంలో సీఎంఎస్ సంస్థ నిర్దేశిత ప్రమాణాలు పాటించలేదని ఎస్పీ సుమిత్ సునీల్ తెలిపారు. నగదుతో కూడిన వాహనం ఎక్కడైనా నిలిపి ఉంచినప్పుడు డ్రైవర్ పాటు ఇద్దరు సాయుధ గార్డులు కాపలా ఉండాలని, వాహనంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టిపుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వాహనంలోని నగదు చోరీకి గురైన సమయంలో సంబంధిత ఏజెన్సీ ఇవేవీ పాటించలేదని చెప్పారు. చోరీ విషయం తెలిసిన వెంటనే అదనపు ఎస్పీ(క్రైమ్స్) ఎస్వీ.శ్రీధర్రావు, డీఎస్పీ కిషోర్బాబు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి, సీసీఎస్ సీఐ టి.విజయ్కృష్ణ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన ఎస్సైలు పున్నారావు, విజయ్కుమార్, మద్దిపాడు ఎస్సై వి.మహేష్లతో పాటు క్రైమ్ పార్టీ ఏఎస్సైలు టి.బాలాంజనేయులు, కె.సురేష్, నాగేశ్వరరావు, రమేష్బాబు, హెడ్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, రాంబాబు, ఖాజావలి, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికే ‘ఇంటి’కి పట్టిన శని
[ 02-05-2024]
సీఎం జగన్ చెప్పే కట్టుకథలకు జగనన్న కాలనీలే నిలువెత్తు నిదర్శనం. ఇళ్లు కాదు ఊళ్లంటూ మైకులు పగిలేలా అరిచి చెప్పారు. రొచ్చుగుంతలు, రాళ్లగుట్టలు, శ్మశానాల చెంత, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు సేకరించారు. -
వైకాపా మద్యమా.. మాకేం కనిపించదు
[ 02-05-2024]
‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం.. -
సార్వత్రిక రణం.. హోరెత్తుతున్న ప్రచారం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు. -
అధికారాంతమునా అరాచకం
[ 02-05-2024]
ఎన్నికల వేళా వైకాపాలోని భూ బకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. విలువైన భూములపై కన్నేస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే వాటిలో పాగా వేసేందుకు తహతహలాడుతున్నారు. -
అయిదేళ్లలో కుమ్ముడు
[ 02-05-2024]
గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు. -
జల‘కల’ భగ్నం
[ 02-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు చెందిన పంట పొలాల్లో ఉచితంగా అమర్చాలన్నదే పథకం ఉద్దేశం. -
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సీట్లూ వదలొద్దు
[ 02-05-2024]
ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేపట్టకుండా పటిష్ఠ నిఘా అవసరమని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్ సూచించారు. -
నిరుద్యోగ యువత వేసే మార్కులు సున్నా
[ 02-05-2024]
ప్రోగ్రెస్ కార్డు మీ ముందుంచుతున్నాను.. మార్కులు మీరే వేయాలంటూ పదే పదే చెబుతున్న సీఎం జగన్కు నిరుద్యోగ యువతగా తామిచ్చేది సున్నా అని పాదయాత్ర బృందం సభ్యులు ఎద్దేవా చేశారు. -
జై చెన్నకేశవా.. జైజై చెన్నకేశవా
[ 02-05-2024]
నాలుగు యుగాల దేవుడిగా భక్తుల నుంచి పూజలందుకునే మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. -
ఓటమి భయం.. తపాలా ఓట్లకు గాలం
[ 02-05-2024]
ఓటమి భయం వైకాపాను వెంటాడుతోంది. ఉద్యోగుల్లో ఆ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉండటం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. దీంతో ప్రలోభాల పరంపరను మరింత ముమ్మరం చేసింది. తమ నాయకుల ద్వారా ఆ పార్టీలోని కొందరు అనుకూల ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఇతరుల ఓట్లకు గాలం వేస్తోంది. -
కబ్జా చెరలో చారిత్రక దుర్గం
[ 02-05-2024]
చారిత్రక కనిగిరి దుర్గానికీ దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. నాటి రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కోటను, కొండరాళ్లను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. -
వైకాపా నేత అయినాబత్తిన తెదేపాలో చేరిక
[ 02-05-2024]
ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ తెదేపాలో చేరారు. -
పన్ను పెంపు.. బాదుడే బాదుడు
[ 02-05-2024]
ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది. -
వైకాపా దర్శి అభ్యర్థి ఎదుటే బాహాబాహీ
[ 02-05-2024]
వర్గ విబేధాలు వైకాపాను వీడటం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు వేరు కుంపట్లుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకోవడంతో పాటు ఏదేని సందర్భం వస్తే గిట్టని వారిపై దాడులకూ తెగబడుతున్నారు. -
కార్మికుల పనివేళలు రీ షెడ్యూల్ చేయాలి
[ 02-05-2024]
జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలులు అధికంగా ఉన్నందున వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పనివేళలను రీ షెడ్యూల్ చేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!