తెదేపాతోనే మత్స్యకారులకు భరోసా
తెలుగుదేశం పార్టీతోనే మత్స్యకారులకు భరోసా దక్కుతుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. గార మండలం బందరువానిపేటలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు.
గార, న్యూస్టుడే: తెలుగుదేశం పార్టీతోనే మత్స్యకారులకు భరోసా దక్కుతుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. గార మండలం బందరువానిపేటలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. గార మండల కేంద్రం నుంచి బందరువానిపేట వరకు నిర్వహించిన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనలో మత్స్యకారులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎక్కడ చూసినా అన్యాయం, దగా, మోసమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అయిదేళ్లలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తెదేపా హయాంలో ఇచ్చిన పథకాలు ఎత్తేశారని, గ్రామాలకు తాగునీరు సైతం సక్రమంగా అందించని దుస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో దిగిన వైకాపా బందిపోటు దొంగల్ని తరిమి కొట్టాలంటే.. అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెదేపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే చట్ట సభల్లో మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జనసేన, భాజపా నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, పైడి వేణుగోపాలం, శవ్వాన ఉమామహేశ్వరి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవ్వాతాతల.. ఉసురు పోసుకుంటారా?
[ 30-04-2024]
ఓ వైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు ఇళ్లకు ఎక్కడో దూరాన ఉన్న బ్యాంకులు.. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ పేరుతో అధికార పక్షానికి మేలు చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. -
లెక్క తేలింది
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది. -
ఖాకీలకు జగనన్న కుచ్చుటోపీ
[ 30-04-2024]
ప్రజల ధన, మాన, ప్రాణాల పరిరక్షణకు పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ అహర్నిశలు విధిలో నిర్వహణలో ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
పాలకుల పక్షపాతం.. మారని పల్లెచిత్రం..!
[ 30-04-2024]
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మట్టి రహదారులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా హయాంలో బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. -
జెండా మారుతోంది..
[ 30-04-2024]
లావేరు మండలం సహపురం పంచాయతీ హనుమంతపురం నుంచి వైకాపాకు చెందిన 50 కుటుంబాలు సోమవారం కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో కూటమిలో చేరాయి. -
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తాం
[ 30-04-2024]
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ జయంతి పేర్కొన్నారు. -
బాబు సీఎం కావాలని దివ్యాంగుడి ప్రచారం
[ 30-04-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ దివ్యాంగుడు ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. -
రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు
[ 30-04-2024]
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాదిగలు, మాదిగ ఉప కులాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్జే ప్రకాష్ వెల్లడించారు. -
అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలి
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం వేళ అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలని ఎస్ఈబీ డీసీ డి.శ్రీరామచంద్రమూర్తి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్ఈబీ కార్యాలయంలో ఎస్ఈబీ ఏఎస్పీ డి.గంగాధరం అధ్యక్షతన సోమవారం ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. -
రూ.29.5 లక్షల నగదు స్వాధీనం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో సోమవారం భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విశాఖపట్నం నుంచి మెళియాపుట్టికి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.29.5 లక్షల నగదును శ్రీకాకుళం