తెదేపా విజయానికి కృషి చేయాలి
పలాసలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజాగళం సభకు విశేష స్పందన లభించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం: పలాసలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజాగళం సభకు విశేష స్పందన లభించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముంగిట విజయమే లక్ష్యంగా శ్రమించేందుకు ఇది దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పలాస వచ్చిన చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి గౌతు శిరీష నివాస ప్రాంగణం వద్ద బస్సులో బస చేశారు. ఆ సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వైకాపా నాయకులు చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మంగళవారం ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధినేతను కలిసేందుకు తరలివచ్చారు. రెండోరోజూ చేరికలు జరిగాయి. దీంతో సందడి వాతావరణం నెలకొంది. తెదేపాపై పలాసలో ప్రజల ఆదరణ పెరిగిందని మరింత కష్టపడి పనిచేసి విజయం సాధించాలని శిరీషకు చంద్రబాబు సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జి గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ దంపతులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తొలుత శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులు, నాయకులతో సమీక్ష సమావేశం ఉంటుందని అనుకున్నా రద్దయింది. ఉదయం 10:40 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్లో పలాస నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న మాయ‘దారి’ పాలన..!
[ 29-04-2024]
వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు. -
తెదేపాలోకి వరం కుటుంబం
[ 29-04-2024]
-
ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. -
పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!
[ 29-04-2024]
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. -
ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..
[ 29-04-2024]
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 29-04-2024]
జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. -
మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్
[ 29-04-2024]
జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు. -
సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు
[ 29-04-2024]
ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?
[ 29-04-2024]
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. -
అడ్డదారిలో అద్దెకు..!
[ 29-04-2024]
కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్