ఐఐపీఈ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతుల చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుశాఖ సహాయమంత్రి రామేశ్వర్
స్నాతకోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తెలి
ప్రతిజ్ఞ చేస్తున్న పట్టభద్రులు
ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే: పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతుల చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలి అన్నారు. శుక్రవారం వి.ఎం.ఆర్.డి.ఎ బాలల ప్రాంగణంలో ‘భారత పెట్రోలియం, శక్తి సంస్థ’ (ఐఐపీఈ) తొలి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను అందించి అభినందించారు.. కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ 19వ శతాబ్దంలో పెట్రోలు కంపెనీ అసోమ్లో ఉండేదని, ఇక్కడి నుంచి ఎగుమతి జరిగేదని తెలిపారు. బ్రిటిష్ పాలకుల తీరుతో దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐఐపీఈలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఐపీఈ సంచాలకులు ఆచార్య వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ 2014లో ఐఐపీఈ మంజూరవగా 2016 నుంచి నిర్వహిస్తున్నామన్నారు. 201 ఎకరాలు పక్కాభవనాలకు కేటాయించగా న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇంతవరకు భవనాలకు నోచుకోలేదన్నారు. ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో అందులో 160ఎకరాల భూమి యాజమాన్యహక్కు లభించిందని తెలిపారు. అంతా సవ్యంగా ఉంటే 2025-26 నాటికి సొంత ప్రాంగణం నుంచి ఐఐపీఈ నిర్వహిస్తామన్నారు. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు పి.కె.బానిక్ మాట్లాడుతూ ఐఐపీఈ ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత విద్యార్థులతో ప్రమాణం చేయించారు. 2016-20, 2017-21 సంవత్సరాలకు చెందిన 170మంది విద్యార్థులకు పట్టాలు అందించాల్సి ఉండగా కొవిడ్ నిబంధనల వల్ల హాజరైన 65మందికి మాత్రమే అందించారు. రెండు బ్యాచ్ల్లోని ఆరుగురు విద్యార్థులకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు.
ఉప రాష్ట్రపతికి ఘన వీడ్కోలు
విశాఖపట్నం జిల్లాలో మూడు రోజుల పర్యటన అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో హైదారాబాద్కు బయలుదేరారు. విమానాశ్రయంలో మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా, నేవీ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఏయూ మైదానంలో ఉదయపు నడక
ఉదయం పూట నడక, యోగ, ధ్యానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నగరానికి వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం ఏయూ ఫుట్బాల్ మైదానంలోకి ఉదయపు నడకకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాయామం చేస్తున్న క్రీడాకారులతో కొద్దిసేపు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.