logo

సహాయ నిధితో పేదలకు మేలు

ప్రాణాపాయ స్థితిలో ఎంతో మంది పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రాణదాతగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన శిలపరశెట్టి

Published : 09 Aug 2022 05:46 IST

బాధితుడికి చెక్కు అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ప్రాణాపాయ స్థితిలో ఎంతో మంది పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రాణదాతగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన శిలపరశెట్టి వెంకటరావుకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2 లక్షల చెక్కును తారువలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లిలో మంగళవారం జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి నాగ శిరీష ఆహ్వానించారు. సోమవారం తారువలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన ఆమె ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. వైఎస్‌ఆర్‌ ఉపాధ్యాయ సంఘ నాయకుడు చిరికి శ్రీనివాసరావు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని