ఎత్తుకు పైఎత్తులు.. పంచ్మీద పంచ్లు..
అమ్మాయిలకు ఆత్మ రక్షణతో పాటు మెదడు చురుకుగా పని చేసేలా ఉపయోగపడే క్రీడ చెస్ బాక్సింగ్. ఇందులో పట్టు సాధించాలంటే కఠోర సాధనతో పాటు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కావాలి.
జాతీయ చెస్ బాక్సింగ్ పోటీల్లో అమ్మాయిల సత్తా
టర్కీలో నిర్వహించనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
సాధనలో భాగంగా వ్యాయామం చేస్తున్న అమ్మాయిలు
అమ్మాయిలకు ఆత్మ రక్షణతో పాటు మెదడు చురుకుగా పని చేసేలా ఉపయోగపడే క్రీడ చెస్ బాక్సింగ్. ఇందులో పట్టు సాధించాలంటే కఠోర సాధనతో పాటు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కావాలి. శరీర నియంత్రణ, నైపుణ్యాలు, పట్టుదల, బలం, ఆత్మవిశ్వాసం, చురుకుదనం చాలా అవసరం. ఇటువంటి క్రీడలో రాణిస్తున్నారు పరవాడ మండలం పి.భోనంగిలోని ఓ పాఠశాలలకు చెందిన విద్యార్థులు. కోచ్ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయిలో సత్తాచాటి పతకాలను సాధిస్తున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన జాతీయ చెస్ బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటి నవంబరు 11 నుంచి 17 వరకు తుర్కియే(టర్కీ) దేశంలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. వీరి కుటుంబ నేపథ్యం, క్రీడా సాధన, శిక్షణ తదితర అంశాలపై ‘న్యూస్టుడే’ కథనం.. - న్యూస్టుడే, పరవాడ
స్నేహితుల సాధన చూసి..
స్నేహితుల సాధన చూసి క్రీడపై ఆసక్తి పెంచుకున్నా. గత నాలుగేళ్లుగా తర్ఫీదు పొందుతున్నాను. స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సోంపేట. తండ్రి రమేశ్ వ్యాపారి. తల్లి సుశీల గృహిణి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన జాతీయ చెస్ బాక్సింగ్ పోటీల్లో 58 కేజీల సబ్ జూనియర్ విభాగంలో ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణిలను ఎదుర్కొని బంగారు పతకం సాధించాను. పోటీతత్వం, ఫిట్నెస్, జ్ఞాపకశక్తి పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో పతకమే లక్ష్యంగా సాధన ముమ్మరం చేశాను. - సాయిసమీరా, 9వ తరగతి
తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో..
తల్లిదండ్రుల, అధ్యాపకుల ప్రోత్సాహంతో చెస్ బాక్సింగ్ నేర్చుకుంటున్నా. ప్రతిరోజు 2 గంటల పాటు కఠోర సాధన చేస్తున్నా. తండ్రి మెహతాజీ వైద్యులు. అమ్మ దత్తప్రియ గృహిణి. స్వగ్రామం యలమంచిలి దరి తులసీనగర్. అహ్మదాబాద్ పోటీల్లో 48 కేజీల సబ్ జూనియర్ జూనియర్ విభాగం పోటీల్లో ఇతర రాష్ట్రాల క్రీడాకారులను ఓడించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికవడం సంతోషంగా ఉంది. ప్రత్యర్థి చేస్తున్న తప్పులను, శరీర కదలికలపై దృష్టిసారించంతో బాగా రాణిస్తున్నాను. - ఎన్.హాసిని, 9వ తరగతి
ఆత్మరక్షణ కోసమే నేర్చుకున్నా..
కోచ్ల సమక్షంలో రోజూ తర్ఫీదు పొందుతున్నాను. స్వగ్రామం నర్సీపట్నం దరి శారదానగర్. తండ్రి శ్రీనివాసరావు వ్యాపారి. తల్లి గంగాభవాని గృహిణి. ఆత్మరక్షణ కోసం నాన్న నేర్చుకోమనడంతో ఆసక్తి పెంచుకున్నా. మూడేళ్లుగా ప్రతిరోజూ రెండు గంటల పాటు సాధన చేసి నైపుణ్యాలు పెంచుకుంటున్నా. జాతీయ పోటీల్లో 54 కేజీల సబ్ జూనియర్ విభాగంలో అర్హత సాధించి అర్హత సాధించాను. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నా.- ఎం.తన్వితగాయత్రి, 9వ తరగతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.