logo

సంక్షేమ పథకాల పేరుతో లూటీ

వైకాపా ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా జిల్లా అధ్యక్షులు గండి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మడుతూరులో నియోజకవర్గ కన్వీనర్‌ రాజాన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో శనివారం ప్రజాపోరు సభ జరిగింది.

Updated : 25 Sep 2022 06:42 IST

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షులు గండి సత్యనారాయణ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా జిల్లా అధ్యక్షులు గండి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మడుతూరులో నియోజకవర్గ కన్వీనర్‌ రాజాన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో శనివారం ప్రజాపోరు సభ జరిగింది. సంక్షేమ పథకాల పేరుతో జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందన్నారు. దీంతోపాటు మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రధాని ఫొటో కూడా లేకుండా రాష్ట్ర పథకాలగా ప్రచారం చేస్తున్నారని, దీనిని తిప్పికొట్టాలన్నారు. నియోజకవర్గ కన్వీనర్‌ రాజాన సన్యాసినాయుడు, గొంతిన భక్తసాయిరాం, అగ్గాల హనుమంతురావు, మేరుగు కాసుబాబు, రాజాన రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని