ఓ మహాత్మా.. ఓ మహర్షి.. మళ్లీ రావా..!
‘మహాత్మా గాంధీ లాంటి రక్తమాంసాలు నిండిన ఓవ్యక్తి..ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు ఆశ్చర్య పడక మానవు అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత ఆల్బర్ట్ ఐన్స్టీన్.. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధాపడి ఉందన్నారు పూజ్య బాపూజీ.
నేడు జాతిపిత గాంధీజీ జయంతి
సాగర్నగర్, న్యూస్టుడే
ఓ మహాత్మా.. ఓ మహర్షి..
జాతికి గ్రహణం పట్టిన వేళ..
మాతృభూమి మొరపెట్టిన వేళ..
ప్రజల్లో ఐక్యత నింపి..కనువెలుగై నడిపించావు..
సత్యం..అహింస అనే ఆయుధాలు ధరించి..
స్వరాజ్య సమరం పూరించావు..
స్వాతంత్య్ర ఫలం సాధించావు..
ఓ మహాత్మా.. ఓ మహర్షి..
దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చి 75ఏళ్లయింది..
అమృతోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం..
తప్పటడుగులు పడుతున్నా..భుజకీర్తులు తొడుక్కున్నాం..
నీ మాటలు మరచి..నీ బాటను విడిచాం..
కలతలు రేగి..కత్తులు దూసుకుంటున్నాం..
నీవు నడయాడిన నేల.. నేరగాళ్ల రాజ్యమైంది..
నీ స్వప్నం భగ్నమైంది.. మళ్లీ అంధకారం ఆవహిస్తోంది..
ఓ మహాత్మా.. ఓ మహర్షి..మళ్లీ రావా..
దిక్కుతోచని జాతికి దారి చూపించవా..!
యువత భవితకు బాపూజీ సప్త సూత్రాలు..
‘మహాత్మా గాంధీ లాంటి రక్తమాంసాలు నిండిన ఓవ్యక్తి..ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు ఆశ్చర్య పడక మానవు అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత ఆల్బర్ట్ ఐన్స్టీన్.. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధాపడి ఉందన్నారు పూజ్య బాపూజీ. ఆ మహాత్ముని ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకుంటే దేశం ప్రగతి పథంలో పయనించడంతో పాటు దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదుగుతారని గీతం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య బి.నళిని పేర్కొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా..నాడు ఆయన ప్రవచించిన సప్త సిద్ధాంతాలు యువతకు ఎలా మార్గదర్శకమో వివరిస్తున్నారు.
1. అశాంతి..అసహనం ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో గాంధీజీ అహింసా మార్గానికి అధిక ప్రాధాన్యత ఉంది. అది ప్రపంచంలో శాంతిని నెలకొల్పే మార్గాలు చూపగలదనే అంశాన్ని యువత గుర్తించి ముందుకు సాగాలి.
2. ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో రామాయణం ప్రబోధిస్తే.. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను మహా భారతం చాటిచెప్పింది. గాంధీ మార్గం సత్యం, ధర్మం, అహింసలపై ఆధారపడింది. ఆ మార్గం ఎన్నో రాజ్య సమస్యలకు పరిష్కారం చూపగలిగిందనే విషయం నేటి యువత గుర్తుంచుకోవాలి.
3. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో అశాంతిని సృష్టించడం, హింసను ప్రేరేపించడం తదితర విపరిణామాలు ప్రస్తుతం చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో మహాత్ముడి చూపిన సత్యం, ధర్మం, అహింసను మనస్ఫూర్తిగా ఆచరిస్తే ఆధునిక సమాజంలో విలువలు పెరుగుతాయి.
మ్యూజియంలో గాంధీజీ అరుదైన చిత్రాలు
4. గాంధీజీ సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచానికి అనుసరణీయం. స్వరాజ్యం, స్వదేశీ అనే నినాదాలు భారతదేశాన్ని బలమైన శక్తిగా మారుస్తాయని బాపూజీ వందేళ్ల క్రితమే భావించారు. ఏ దేశమేగినా యువత స్వదేశాన్ని మరువకూడదనే అంతరార్థం అందులో ఉంది.
5. స్వచ్ఛత, శుభ్రతకు మహాత్ముడు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యువత అవి పాటించాలని వందేళ్ల కిందటే ప్రబోధించారు. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శిబిరాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్ని స్వచ్ఛభారత్ వైపు మళ్లించాలి.
6. మనిషి ప్రకృతితో మమేకమవ్వాలి.. అందులో అన్ని ప్రాణులకు భాగస్వామ్యం ఉందనే విషయం మరువకూడదు. మనిషి అవసరాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయకూడదు.. అది భావి తరాలకు శ్రేయస్కరం కాదని మహాత్ముడు చెప్పారు. అందుకే యువత పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలి.. భూతదయ కనబర్చాలి.
7. స్వాతంత్య్ర సమరంలో బాపూజీ పాల్గొన్న ఉద్యమాలు, వివిధ చారిత్రక ఘట్టాలు, మహాత్ముని లేఖలు, ఆటో బయోగ్రఫీ సత్యశోధన గ్రంథం భారత జాతికి ఎంతో అమూల్యమైనవి. వాటి ద్వారా యువత గాంధీ తత్వం తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి.
* గీతం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్లో ఏర్పాటైన మ్యూజియం యువతకు ఒక వరం. ఎన్నో అపూరూప చిత్రాలు ఇందులో కొలువై ఉన్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయం చేస్తే మహాత్ముడు ఎంత నిరాడంబరంగా జీవించారో తెలుస్తుంది. యువత మంచి మార్గంలో పయనించడానికి దారి చూపుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.