logo

పెళ్లి మండపంలో కలకలం

వివాహ వేడుక జరుగుతున్న సమయంలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పెళ్లికి వచ్చిన వారంతా పరుగులు తీశారు.

Updated : 27 Jan 2023 04:21 IST

ఊడిపోయి పైకి లేచిన టైల్స్‌

పెందుర్తి, న్యూస్‌టుడే:  వివాహ వేడుక జరుగుతున్న సమయంలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పెళ్లికి వచ్చిన వారంతా పరుగులు తీశారు. ఆ వివరాలిలా.. చినముషిడివాడలోని దాట్ల కల్యాణ మండపం మొదటి అంతస్తులో  గురువారం రాత్రి ఓ వైపు వివాహ వేడుక జరుగుతోంది. అదే సమయంలో పెళ్లికొచ్చిన వారు భోజనాలు చేస్తుండగా ఒక్కసారిగా టైల్స్‌ పగిలిపోవడం ప్రారంభించాయి. పలుచోట్ల ఎగిరిపడ్డాయి. ఈ హఠాత్పరిణామానికి భీతావహులైన పెళ్లి బృందం సభ్యులు కల్యాణ మండపం నుంచి బయటకు పరుగులుతీశారు. పెందుర్తి పోలీసులకు, మండపం యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఎస్‌ఐ సురేశ్‌, సిబ్బందికి అక్కడకు చేరుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తు మినహా మిగిలిన చోట్ల ఎలాంటి పగుళ్లు లేవు. పెళ్లి బృందం ఆందోళన నేపథ్యంలో కల్యాణ మండపం యాజమాన్యం కృష్ణరాయపురంలోని మరో కల్యాణ మండపాన్ని వారికి సమకూర్చారు. * తొలుత వివాహాన్ని చినముషిడివాడ శారదాపీఠం పక్కనున్న పోర్టు కల్యాణ మండపంలో నిర్వహించేందుకు నెలన్నర క్రితమే బుక్‌ చేశారు. పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్‌, గవర్నర్లు వస్తున్నారని, కల్యాణ మండపం ఇవ్వలేమని నిర్వాహకులు తెలపడంతో దాట్ల కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేసుకోగా ఇలా జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని