logo

వారంలోనే విరిగిపోయాయే!

జగనన్న కాలనీలకు నాణ్యత లేని విద్యుత్తు స్తంభాలు వేయడం పట్ల లబ్ధిదారులు ఆందోళ]న చెందుతున్నారు. వేసిన వారం రోజులకే ఈదురు గాలులకు 11 స్తంభాలు విరిగిపోయాయి.

Updated : 24 Mar 2023 06:38 IST

మాడుగుల, న్యూస్‌టుడే: జగనన్న కాలనీలకు నాణ్యత లేని విద్యుత్తు స్తంభాలు వేయడం పట్ల లబ్ధిదారులు ఆందోళ]న చెందుతున్నారు. వేసిన వారం రోజులకే ఈదురు గాలులకు 11 స్తంభాలు విరిగిపోయాయి. మాడుగుల మోదకొండమ్మ ఆలయానికి చేరువగా నిర్మిస్తున్న రెండు కాలనీల్లో 200 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ కాలనీలకు విద్యుత్తు సరఫరా చేయడానికి స్తంభాలు వేశారు. అవి నాణ్యతగా లేకపోవడం, స్తంభాలు లోతుగా వేయకపోవడంతో గాలులకు విరిగి రోడ్డుపై పడిపోయాయి.
*  విద్యుత్తు స్తంభాలు పడిపోయిన అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. నాణ్యత గలిగిన వాటిని వేసేలా చర్యలు తీసుకుంటాం.
సత్యనారాయణ, ఏఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని