ఆధార్ అనుసంధానానికి పరుగులు
ఓటుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెలాఖరులోగా శత శాతం లక్ష్యం చేరుకోవాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో అధికారులు, బీఎల్వోలు పరుగులు తీస్తున్నారు.
జిల్లాలో 72% పూర్తి
నక్కపల్లి, న్యూస్టుడే
ఓటుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెలాఖరులోగా శత శాతం లక్ష్యం చేరుకోవాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో అధికారులు, బీఎల్వోలు పరుగులు తీస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో జిల్లాలో 13 శాతానికిపైగా ప్రక్రియ పూర్తి చేశారు.
వివరాలను ఆన్లైన్ చేస్తున్న సిబ్బంది
ఓటరు జాబితాల్లో ఇప్పటికీ తేడాలు ఉండటంతో ‘ఒకరికి ఒక ఓటు’ అనే లక్ష్యాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేశారు. గతేడాది ఫొటో సిమిలర్ ఎంట్రీ ద్వారా చాలా వరకు రెండో ఓట్లను తొలగించారు.
జిల్లాలో సుమారు 23 వేల ఓట్లను రెండో ఓటుగా గుర్తించారు. ఇది పూర్తిస్థాయిలో జరగలేదు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా ఒకరికి ఒకే ఓటు ఉండేలా చేయొచ్చని గుర్తించారు. దీనికోసం ప్రతి ఓటరు నుంచి ఆధార్ నంబరు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. బీఎల్వోలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఆధార్ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఆధార్ వివరాలు సేకరిస్తున్న బీఎల్వోలు
ప్రత్యేక కార్యాచరణ
ఆధార్ వివరాలు తీసుకుని గరుడ యాప్లో అనుసంధానం చేస్తున్నారు. ఇదీ అంతంతమాత్రంగానే జరుగుతుండగా.. ఈ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టిసారించారు. ఈ నెల మొదటి వారానికి జిల్లా వ్యాప్తంగా 59 శాతం మాత్రమే పూర్తి చేయడంతో ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల నియోజకవర్గాల వారీగా అధికారులు, బీఎల్వోలతో ఈఆర్వోలు సమావేశం నిర్వహించారు.
బాగా వెనుకబడి ఉన్న ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆదివారం గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రెవెన్యూ, మండల పరిషత్తు అధికారుల పర్యవేక్షణలో బీఎల్వోలంతా గ్రామాల్లో పర్యటించి ఆధార్ వివరాలను సేకరించి అనుసంధానించారు.
మొత్తం 12,74,918 ఓటర్లకు 9,22,579 మంది ఆధార్ వివరాలను అనుసంధానం చేశారు. తద్వారా 72.36 శాతంగా నమోదైంది. నెలాఖరులోగా మరింత పెంచాలనే లక్ష్యంతో ఇదే వేగాన్ని కొనసాగిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం మాడుగుల నియోజకవర్గం మొదటి స్థానానికి చేరుకోగా, జిల్లాలో అత్యధిక ఓటర్లున్న ‘పేట’ నియోజకవర్గం తృతీయ స్థానôలో నిలిచింది. అనకాపల్లి చివరన ఉంది.
వలస ఓటర్లపైనా దృష్టి : జిల్లాలో కొన్ని మండలాల్లో ఆధార్ అనుసంధాన ప్రక్రియ మరీ తక్కువగా ఉంది. సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. తద్వారా కాస్త మెరుగుపడింది. ఇది నిర్బంధమేమీ కాదు. అనుసంధానం వల్ల ఓటర్ల్లకే మేలు జరుగుతుంది. నకిలీ ఓటుకు అవకాశం ఉండదు. వలసవెళ్లిన ఓటర్లపైనా దృష్టిపెట్టాం. ఇలాంటి వారంతా పండగలకు, వ్యక్తిగత పనులపై సొంతూరుకి వచ్చినప్పుడు ఆధార్ అనుసంధానం చేసేలా ఆదేశాలిచ్చాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ.
పి.వెంకటరమణ, డీఆర్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.