logo

హెచ్‌పీసీఎల్‌లో ఒప్పంద కార్మికుడి మృతి

హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడు మృతి చెందిన ఘటనపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 30 Mar 2023 04:33 IST

సుధాకర్‌ (పాత చిత్రం)

సింధియా, న్యూస్‌టుడే: హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడు మృతి చెందిన ఘటనపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు... పారిశ్రామిక ప్రాంతం ప్రకాశ్‌నగర్‌కు చెందిన యాండ్రపు సుధాకర్‌ (49) రిఫైనరీలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం బొలెరో వాహనంలోకి ఇనుప రాడ్లు లోడ్‌ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఇనుపరాడ్లు జారి సుధాకర్‌ తలపై పడ్డాయి. తీవ్ర గాయాలవడంతో సహచర కార్మికులు మధ్యాహ్నం 3.30 గంటలకు ఈఎస్‌ఐ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందిస్తుండగా సాయంత్రం 4.50 గంటలకు సుధాకర్‌ మృతి చెందాడు. నష్ట పరిహారం కోసం మృతుడి కుటుంబీకులు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బి.లూథర్‌బాబు పర్యవేక్షణలో ఎస్సై దేముడమ్మ దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని