వివాదాస్పదం.. ముదపాక వ్యవహారం
పెందుర్తి మండలం ముదపాకలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం’ భూసమీకరణలో రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి.
రైతులకు ఎల్వోపీసీలు ఇవ్వడంలో అలసత్వం
ఈనాడు, విశాఖపట్నం: పెందుర్తి మండలం ముదపాకలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం’ భూసమీకరణలో రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. భూములు ఇచ్చిన నిజమైన రైతుల పేర్లకు బదులు ఇతరులవి ఉండడం, కొందరికి ఎల్వోపీసీ (భూ యాజమాన్య హక్కు సమీకరణ పత్రాలు) ఇవ్వకపోవడం వంటివి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం తీరుతో పలువురు రైతులు తీవ్రంగా విసిగిపోయారు. వీరు చేస్తున్న పనులను సహించలేని సామాన్య రైతులు పోరాడలేక చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్థితికి వచ్చారు. న్యాయస్థానం ఇక్కడి వ్యవహారాల మీద ఏకంగా అడ్వకేట్ కమిషన్ను నియమించే పరిస్థితికి రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. కేవలం అధికారుల అత్యుత్సాహమే దీనికి కారణమైంది. ఫలితంగా నేరుగా కలెక్టరు వచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చింది. వీటన్నింటి కారణంగా పెందుర్తి తహసీల్దార్ ఆనందకుమార్ను బదిలీ చేశారంటున్నారు. అధికారులు మాత్రం త్వరలో జరిగే బదిలీల్లో భాగంగానే చేశామని పేర్కొంటున్నారు.
సముదాయించి ఉంటే..
ఈనాడు, విశాఖపట్నం: పెందుర్తి మండలం ముదపాకలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం’ భూసమీకరణలో రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. భూములు ఇచ్చిన నిజమైన రైతుల పేర్లకు బదులు ఇతరులవి ఉండడం, కొందరికి ఎల్వోపీసీ (భూ యాజమాన్య హక్కు సమీకరణ పత్రాలు) ఇవ్వకపోవడం వంటివి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం తీరుతో పలువురు రైతులు తీవ్రంగా విసిగిపోయారు. వీరు చేస్తున్న పనులను సహించలేని సామాన్య రైతులు పోరాడలేక చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్థితికి వచ్చారు. న్యాయస్థానం ఇక్కడి వ్యవహారాల మీద ఏకంగా అడ్వకేట్ కమిషన్ను నియమించే పరిస్థితికి రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. కేవలం అధికారుల అత్యుత్సాహమే దీనికి కారణమైంది. ఫలితంగా నేరుగా కలెక్టరు వచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చింది. వీటన్నింటి కారణంగా పెందుర్తి తహసీల్దార్ ఆనందకుమార్ను బదిలీ చేశారంటున్నారు. అధికారులు మాత్రం త్వరలో జరిగే బదిలీల్లో భాగంగానే చేశామని పేర్కొంటున్నారు.
కోర్టుధిక్కారంపై అడ్వకేట్ కమిషన్ విచారణ
ముదపాక భూసమీకరణ పనుల్లో కోర్టు ధిక్కరణపై హైకోర్టు అడ్వకేట్ కమిషన్ను నియమించగా ఆ కమిషన్ వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం న్యాయస్థానం సెలవుల కారణంగా ఆ నివేదిక బయటకు రాలేదు. అధికారులు ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా అనేది ఆ కమిషన్ పరిశీలించింది. ఈ కమిషన్ వచ్చి వెళ్లాక పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల కిందట మండల సర్వేయర్ను మార్చారు. తాజాగా తహసీల్దార్ను బదిలీ చేశారు. కలెక్టర్ మల్లికార్జున పెందుర్తి తహసీల్దార్ వ్యవహారంలో చూసీచూడనట్లు ఉన్నారన్న విమర్శలు బాహాటంగానే వచ్చాయి.
ఇద్దరు తహసీల్దార్ల ఆకస్మిక బదిలీ
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన పరమైన అంశాల ఆధారంగా వారిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెందుర్తి తహసీల్దార్ ఎం.ఆనందకుమార్ భూ వ్యవహారాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ బదిలీలు జరుగుతున్న వేళ కలెక్టర్ ఆకస్మికంగా ఆయన్ను సీతమ్మధార తహసీల్దార్గా పంపించారు. అక్కడ పనిచేస్తున్న శ్యామ్ను పెందుర్తి తహసీల్దార్గా బదిలీ చేశారు. రెవెన్యూశాఖలో ఈనెల 31న బదిలీలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో అంతకు ముందే వీరిద్దర్నీ మార్చడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో మూడు తహసీల్దార్ క్యాడర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భీమిలి ఆర్డీఓ కార్యాలయ ఏఓ, ల్యాండ్సీలింగ్ విభాగ ప్రత్యేక తహసీల్దార్, కలెక్టరేట్లోని డీ సెక్షన్ విభాగ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి పలువురు తహసీల్దార్లను బదిలీ చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434