Vizag: క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. గత నెలలో షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. విశాఖకు రెండు మ్యాచ్లు కేటాయించింది. అందులో భాగంగా దిల్లీ క్యాపిటల్స్.. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. దిల్లీ, చెన్నై మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆన్లైన్లో టికెట్ విక్రయాలు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే మొత్తం ఖాళీ అయిపోయాయని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయా టికెట్లకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో బేరసారాలు జరగడం గమనార్హం.
రూ.3,500 టికెట్ రూ.30 వేలకు..
ఈనెల 31న దిల్లీ, చెన్నై మ్యాచ్ జరగనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభించారు. 7 గంటల నుంచే అభిమానులు ఆన్లైన్లో ఎదురుచూశారు. ప్రారంభించిన వెంటనే ప్రయత్నించినా టికెట్లు దొరకలేదని పలువురు చెబుతున్నారు. రూ.1000, రూ.1500 టికెట్లు 30 నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి. కొందరు నాలుగు, అయిదు చరవాణులతో ప్రయత్నిస్తే ఒక్కో టికెట్ దొరికింది. ఒక్కో ఫోన్ నంబర్పై రెండు మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశముంది. కానీ కొందరు 5, 6, 8 టికెట్లు అందుబాటులో ఉన్నాయని, మ్యాచ్కు రాలేకపోతున్నాంటూ.. సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తున్నారు. రూ.1500 టికెట్ను రూ.7 వేలకు, రూ.3,500 టికెట్ను రూ.30 వేలకు, రూ.5 వేల టికెట్ను రూ.12 వేలకు కొనుగోలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. అంత ధరేంటని అడిగితే.. ధోనీ ఆడే మ్యాచ్కు డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పడం గమనార్హం.
ఆన్లైన్లోనూ అదే పరిస్థితి..
గతంలో ఆఫ్లైన్ విక్రయాలు చేపట్టిన సమయంలోనూ పెద్దఎత్తున టికెట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్ విధానంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి స్టేడియంలోని కొన్ని బ్లాకుల టికెట్లనే విడుదల చేశారు. వాటిలోనూ ఆన్లైన్ సంస్థ, టీం మేనేజ్మెంట్ కలసి చాలా వరకు బ్లాక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో తమ ప్రమేయం లేదని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. వారి తరఫున కూడా కొన్ని టికెట్లు పక్కదారి పట్టి ఉంటాయని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ధోనీ ఆట చూడాలని..
చెన్నై తరఫున ఆడుతున్న మహేంద్రసింగ్ ధోనీ ఆటతీరుకు ఎందరో అభిమానులున్నారు. 2019 ఫిబ్రవరి 24న ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత విశాఖలో ఆడలేదు. దీంతో స్థానిక అభిమానుల చూపులన్నీ దిల్లీ, చెన్నై మ్యాచ్ మీదే ఉన్నాయి. మరోవైపు గత ఐపీఎల్లో ధోనీ ఎక్కడికి వెళ్లినా స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. ఈ సీజన్లోనూ చెన్నై జట్టు తలపడిన రెండు స్టేడియాలు ప్రేక్షకులతో నిండిపోయాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్టు సత్తా చాటింది. దీంతో ఈనెల 31న జరిగే మ్యాచ్ను ఎలాగైనా వీక్షించాలని చాలా మంది ఉవ్విళ్లూరారు. ఆ అవకాశాన్ని కొందరు క్రికెట్ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎక్స్ (ట్విటర్)లో టికెట్లు ఉన్నాయంటూ కొందరు పెట్టిన మెసేజ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!