చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు.
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
ఈనాడు-విశాఖపట్నం
గంధవరం గ్రామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు (వృత్తంలో)
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. వైకాపా అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొంటూ, జన సమీకరణ చేస్తున్నారు. వైకాపా నాయకులతో ఇంటింటికీ వెళ్లి ఓట్ల పరిశీలనలోనూ పాల్గొంటున్నారు. విశాఖ పరిధిలో ప్రధానంగా భీమిలి నియోజకవర్గాల్లో వాలంటీర్లు రెచ్చిపోతున్నారు.
భీమిలిలో ఇష్టారాజ్యంగా...: భీమిలి నియోజకవర్గం పరిధిలో వాలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి చేపట్టే ప్రచారాలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ర్యాలీకి అవసరమైన జనసేకరణ సైతం వాలంటీర్లే చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం భీమిలి మండల వైకాపా సమావేశంలో లక్ష్మీపురం సచివాలయ క్లస్టర్-1కు చెందిన వాలంటీరు గౌరీశంకర్ పాల్గొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టిలతో కలిసి ఫొటో దిగి హడావుడి చేశారు. ః ఈ నెల 22న రాజులతాళ్లవలసలో మాస్క్లు ధరించి ముగ్గురు వాలంటీర్లు వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు.
పద్మనాభం, న్యూస్టుడే: ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పద్మనాభం మండలం గంధవరం గ్రామంలో ఈనెల 26వ తేదీన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏకంగా ఏడుగురు వాలంటీర్లు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ ప్రచారంలో గ్రామ వాలంటీర్లు పిల్లి ముత్యాలు, కింగం శేఖర్, కొత్తపల్లి అప్పలరాజు, పల్లి ముత్యాలనాయుడు, తాండ్రంగి జగదీశ్, కొత్తపల్లి రామకుమారి, చిప్పాడ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. వీరితో పాటు కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడాన్ని ఇతర పార్టీల నాయకులు తప్పుపడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కరాస, న్యూస్టుడే : విశాఖపట్నంలోని 57వ వార్డు పరిధి 209వ బూత్కు చెందిన వాలంటీరు జి.గౌరీ బుధవారం వైకాపా శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఓటరు జాబితా చేతపట్టుకుని.. అందులోని వివరాలను వైకాపా కార్యకర్తలకు తెలియజేస్తూ.. వారితో కలిసి కాలనీల్లో పర్యటించారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి... ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మిగిలిన చోట్లా అదే తీరు..: విశాఖ తూర్పులోనూ వాలంటీర్లు ఓటర్ల జాబితాలతో వైకాపా నాయకులతో కలిసి తిరుగుతున్నారు. వైకాపా అభ్యర్థి కోసం ఏకంగా వాలంటీరు పోస్టులకు స్వచ్ఛందంగా ఓ నలుగురు రాజీనామా చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పెందుర్తిలో వైకాపా నాయకులు రహస్యంగా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశాలు చేయడంతోపాటు, నగదు కానుకగా ఇస్తున్నట్లు సమాచారం.
అధికారులను నిలదీస్తున్నా...: వాలంటీర్ల పాత్రపై అధికారులను నిలదీస్తున్నా స్పందించడం లేదు. బుధవారం భీమిలి ఆర్డీవో కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో రెవెన్యూ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటున్నా, చర్యలు కఠినంగా లేకపోవడంతో తిరిగి యథావిధిగా పాల్గొంటున్నారని, వారి ప్రచారాలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారని మండల తెదేపా పార్టీ అధ్యక్షులు దంతులూరి అప్పల నరసింహరాజు ఆర్డీవోను నిలదీశారు. 50 కుటుంబాల సమాచారం వాలంటీర్ల వద్ద చరవాణిలో ఉంటుంది కనుక, వెంటనే ఆ ఫోన్లు రికవరీ చేసుకోవాలని కోరారు.
యూసీడీ ఆర్పీల హవా: రైల్వే న్యూకాలనీలో 43వ వార్డుకు చెందిన రిసోర్స్ పర్సన్ సరగడం అలివేణి ఉత్తర నియోజకవర్గం వైకాపా అభ్యర్థి కేకే రాజు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల తూర్పులో యూసీడీ అధికారుల ఆదేశాలతో ఆర్పీలను పిలిపించి, వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నోట్ల కట్టలు పంపిణీ చేశారు.
డ్వాక్రా గ్రూపు మహిళలకు తాయిలాలు అందించడంలో ఆర్పీల హవా ఎక్కువైంది. వైకాపా కండువాలు కప్పుకొని ఆర్పీలు తిరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
[ 27-04-2024]
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు