నాడు-నేడు.. దోచేశారు చూడు!
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు.
పాఠశాలల్లో పనులు పైనపటారం.. లోన లొటారం
నిర్మాణ సామగ్రికి ఉన్నతస్థాయిలోనే కమీషన్లు
ఈనాడు, పాడేరు - న్యూస్టుడే, హుకుంపేట, ఎలమంచిలి
బాలలంతా బడికెళ్తారు..
అక్షర జ్ఞానం పొందడానికి!
అధికార పార్టీ నేతలూ ఈ అయి దేళ్లు బడివైపే చూస్తూ వచ్చారు..
అక్షరాలా లక్షలు కొట్టేయడానికి..
నాడు-నేడు పనులతో సర్కారీ బడులు బాగుపడింది తక్కువే. ఆ పనులు చేయించిన, చేసిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే ఎక్కువ బాగుపడ్డారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. ఉన్నత స్థాయిలో కమీషన్లు బొక్కేసి అవసరం లేనిచోట రూ. కోట్లు ఖర్చుచేసి, అవసరమైన చోట సొమ్ముల్లేక అసంపూర్తిగా నిర్మాణాలు వదిలేశారు.
అనకాపల్లి జిల్లాలో 616 పాఠశాల్లో రెండోవిడత నాడు-నేడు పనులు మంజూరయ్యాయి. మొత్తం అంచనా విలువ రూ. 239 కోట్లయితే దశలవారీగా రూ. 92 కోట్లు రివాల్వింగ్ ఫండ్గా విడుదల చేశారు. ఆ నిధులన్నీ ఎప్పుడో ఖర్చయిపోయాయి. తర్వాత విడుదల చేయాల్సిన సొమ్ములు రాకపోవడంతో తుదిదశలో ఉన్న పనులు అసంపూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా అదనపు గదుల నిర్మాణానికి నిధులు చాలక ఎక్కడికక్కడ మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. అల్లూరి జిల్లాలోనూ 949 పాఠశాలల్లో రూ. 216 కోట్ల అంచనా విలువైన పనులు చేపట్టినప్పటికీ అన్నిచోట్ల అసంపూర్తి నిర్మాణాలే కనిపిస్తున్నాయి.
పాడేరులో ఓ ఆశ్రమ పాఠశాల చుట్టూ నాడు-నేడు నిధులతో నిర్మించిన ప్రహరీ కొద్దిరోజులకే కూలిపోయింది.
కశింకోట మండలంలోని ఓ పాఠశాలలో టైల్స్ నాసిరకం వేయడంతో మంత్రి అమర్నాథ్ ఆ పనులపై అసంతృప్తి వ్యక్తం చేయగా సదరు ఉపాధ్యాయునిపై వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.
నిధులు మేసి.. పనుల్లో నాసి..
- అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పెదకలవలాపల్లి పాఠశాలలో నాడు-నేడు కింద నిర్మించిన రక్షణగోడ చిన్నపాటి వర్షానికే నేలకొరిగింది. ఆ సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
- విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చుకునిపాలెం పాఠశాలలో చేసిన నాసిరకం పనుల వల్ల తరగతి గదిలో కూర్చున్న విద్యార్థులపై పైకప్పు పెచ్చులుపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
- విశాఖపట్నం తోటగురువు పాఠశాలలో ఖర్చు చేసిన నిధులు ఎక్కువ చేసిన పనులు తక్కువగా ఉండడాన్ని అధికారులే గుర్తించారు.
- కస్తూర్బా బాలికా విద్యాలయాల్లోనూ నాడు-నేడు పనుల్లో కమిటీలు భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి.
ప్రాణాలు తీశాయి
- హుకుంపేట మండలంలోని ఉర్రడ, బొడ్డాపుట్టు ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనుల జాప్యం కారణంగా విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి బోధన సాగిస్తున్నారు. గతేడాది పాఠశాల సమీపంలో ఓ విద్యుత్తు ఓ స్తంభం విద్యార్థినిపై పడి చనిపోయింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
- పాయకరావుపేట: దుర్గాకాలనీలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి సన్షేడ్ పలక మీదపడి గతేడాది అక్టోబర్ 9న ఓ విద్యార్థి చనిపోయాడు. ఈ కుటుంబానికి రూ. 5 లక్షలిస్తామన్న సర్కారు రూ. 2 లక్షలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొంది.
కమీషన్ల కథ.. రూ.కోట్లలో వృథా
ఉమ్మడి జిల్లాలో 239 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేశారు. ఆయా పాఠశాలల్లో నాడు-నేడు పనులు అవసరం లేకపోయినా కమీషన్ల కోసం నిర్మాణ సామగ్రి పంపించేశారు. బెంచీలు, చాక్బోర్డులు కొత్తవి తెప్పించారు. మరుగుదొడ్లు, ప్రహరీలు నిర్మించారు. బడి మొత్తాన్ని రంగురంగుల బొమ్మలతో నింపేశారు. రూ. కోట్లు ఖర్చు చేసేశారు. తీరా పనులన్నీ పూర్తయ్యాక ఆ బడులను ఉన్నత పాఠశాలల్లో కలిపేయడం వల్ల ఈ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ కుట్ర లోతు.. బంగాళా‘ఖాత’మంత!!
[ 01-05-2024]
ప్రభుత్వ యంత్రాంగం తగినంత ఉంది. పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేయొచ్చు. అయినా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టే యోచనపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. -
సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు
[ 01-05-2024]
ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. -
నేడు పెందుర్తిలో పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ బుధవారం పెందుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని జీవీఎంసీ తెదేపా ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. -
రెండో విడతలో 12,626 మందికి పోలింగ్ విధులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, గాజువాక, విశాఖ పశ్చిమ, ఎస్.కోట నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు... -
ఎన్నికల పండక్కి.. విశాఖకు రండి!
[ 01-05-2024]
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. -
మాటలకెన్నో అర్థాలు.. నోటినిండా అబద్ధాలు
[ 01-05-2024]
నా బీసీలంటూ.. తరచూ వల్లించే జగన్ వారిని కోలుకోని దెబ్బ తీశారు. ‘బీసీలంటే వెన్నెముక వర్గాలని’ చెప్పి.. అయిదేళ్లలో వారిని మరింత వెనక్కి నెట్టేశారు. జిల్లా జనాభాలో 50 శాతానికి పైగా వెనకబడిన వర్గాల ప్రజలే ఉన్నారు. -
గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
[ 01-05-2024]
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు ఇవే చివరి ఎన్నికలు
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ పరిపాలనకు ఇవే చివరి ఎన్నికలు అని సినీనటుడు, జనసేన ప్రచారకుడు పృథ్విరాజ్ అన్నారు. ఎంవీపీకాలనీ విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
సూపర్ సిక్స్... బంపర్ హిట్ : గణబాబు
[ 01-05-2024]
తెదేపా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు బంపర్ హిట్ అని, వైకాపా మ్యానిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అభిప్రాయపడ్డారు. -
‘కాగితం’పైనే డిప్యుటేషన్ల రద్దు!
[ 01-05-2024]
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు. -
లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి ప్రకటనలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
కార్మికులపై కరకు మనసు!!
[ 01-05-2024]
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. -
ఉపాధి నిధులు మింగేస్తున్నారు..
[ 01-05-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే ఉపాధి నిధులను వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. అచ్యుతాపురం మండలం లంకధర్మవరం, మడుతూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మంగళవారం మాట్లాడారు. -
పేదల స్థలాలు కబ్జా
[ 01-05-2024]
కాయకష్టం చేసి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలను వైకాపాకు చెందిన నాయకుడు కబ్జా చేశాడు. ఐదేళ్ల కితం కొనుగోలు చేసిన ఈ స్థలాలను ఆ నేత పొక్లెయిన్తో చదును చేయించడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. -
విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. -
రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా కూటమిని గెలిపించాలి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని, రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజాపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీనటి ఖుష్బూ తెలిపారు. -
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
బాలుడి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం
[ 01-05-2024]
విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. -
పలు రైళ్ల దారి మళ్లింపు
[ 01-05-2024]
సదరన్ రైల్వే సేలం డివిజన్ వంజిపాల్యం స్టేషన్లో యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా మే 10న డిబ్రూఘర్-కన్యాకుమారీ (22504) రైలు, మే 7, 9, 13 తేదీల్లో ఎర్నాకుళం-టాటానగర్(18190) ఎక్స్ప్రెస్ వయా ఇరుగుర్, పొదనూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు