ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది.
ప్రభుత్వంలో విలీనమైనా దక్కని ప్రయోజనాలు
వేతన సవరణ, బకాయిల చెల్లింపులు ఎప్పుడో?
ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఆవేదన
ఈనాడు, విశాఖపట్నం
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను జగన్ చిదిమేసినట్లయింది. బకాయిలు ఇవ్వలేక, భత్యాలు చెల్లించలేక జగన్ సర్కార్ చేతులెత్తేసి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. ఫలితంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వేల మంది ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
ఆ 75 శాతం ఏవీ: పర్యటనలకు అవసరం నిమిత్తం రూ.23 కోట్లతో ఇటీవల అయిదు ప్రత్యేక బస్సులను కొనిపించిన జగన్ ఉద్యోగుల బకాయిల చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2017లో ఆర్టీసీ వేతన సవరణ చేపట్టగా అప్పటి బకాయిలను ఇప్పటివరకు పూర్తిగాచెల్లించలేదు. మొత్తం ఒకేసారి ఇస్తే భారమవుతుందని నాలుగు భాగాలుగా చేసి మొదట 25 శాతం అందరికి జమ చేసి మిగిలిన 75 శాతం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు.
అవన్నీ ఆగిపోయాయి: వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ప్రభుత్వంలో కలవక ముందు గ్యారేజీ ఉద్యోగులకు రాత్రి భత్యం, డీజిల్ను పొదుపు చేసినందుకు నెలవారి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. అదనంగా పనిచేసిన సమయానికి అదనపు భత్యం, ప్రతి నెలా టెక్నికల్ భత్యం, వేడి దగ్గర పనిచేస్తే హీట్ అలవెన్స్, 45 ఏళ్లు దాటిన మహిళా కండక్టర్లకు ఆరోగ్య భత్యం వంటివి ఉండేవి. ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు వారి అనుభవం ఆధారంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు ఆదాయం వచ్చేది. ఇప్పుడు అవేమీ అందడం లేదు.
- గతంలో రెండేళ్లకు ఒకసారి మూడు జతల ఏకరూప దుస్తులు అందజేయడంతో పాటు కుట్టు కూలి ఇచ్చేవారు. పాదరక్షల కోసం రూ.వెయ్యి అందజేసేవారు. ఇప్పుడు గ్యారేజీ కార్మికులు, ఉద్యోగులు సొంత డబ్బులతో బూట్లు, ఏకరూప దుస్తులు కొనుగోలు చేసుకుంటున్నారు.
- దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మధ్యలో ఆగిపోతే వాటి మరమ్మతుకు ఇక్కడి నుంచి మెకానిక్లు వెళ్లి బాగు చేసేవారు. వీరు వెళ్లినందుకు అయ్యే ఖర్చులు ఇచ్చేవారు. పని వేళలకు మించి చేస్తే ఓటీ ఇచ్చేవారు. ఇప్పుడు అవేమీ ఇవ్వడమే లేదు. భోజనాలకు సొంత డబ్బులే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.
ఆరోగ్య భత్యమూ లేదు: అన్ని రకాల వైద్య సేవలకు ఈహెచ్ఎస్ ఉపయోగపడకపోవడంతో సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల ఓ ఆర్టీసీ ఉద్యోగికి ఛాతిలో నొప్పి రాగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రూ.1.50 లక్షలు చెల్లిస్తేగాని వైద్యం అందించలేమన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగి గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోయేది. వెంటనే చికిత్స ఆరంభించేవారు. అప్పట్లో రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వైద్యం ఉచితంగా అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పదవీ విరమణ ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. ప్రభుత్వంలో విలీనం అయ్యాక తీవ్రంగా నష్టపోయామని వారంతా ఆవేదన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి దుర్మరణం
[ 30-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి