మాట తప్పారు.. మడమ తిప్పారు..
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు.
మద్యం విచ్చలవిడి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఆదాయార్జనే ధ్యేయంగా విక్రయాలు
పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్టుడే: రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. పల్లెలు, పట్టణాల్లో మద్యాన్ని ఏరులై పారేలా చేశారు. ఆదాయార్జనే ధ్యేయంగా తమకు అనుకూలమైన వారితో నాసిరకం మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వేలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. అలాంటి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో మద్యానికి నిర్ధిష్టమైన బ్రాండ్లు ఉండేవి. జగన్ ప్రభుత్వంలో అర్థంపర్థం లేని బ్రాండ్లతో వస్తున్న మద్యం తాగిన వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మద్యం అలవాటును దూరం చేసి మంచి మార్గంలో నడిపించాల్సిన ప్రభుత్వం ధరలు పెంచితే దూరమవుతారని చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది.
- నాణ్యత లేదు.. డబ్బులు వృథా: ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యత లేని మద్యం కారణంగా డబ్బులు వృథా అవుతున్నాయి. చాలామంది రోజంతా కష్టపడిన సొమ్ములో కొంత మొత్తాన్ని మద్యానికే ఖర్చు చేస్తున్నారు. కల్తీ మద్యం కారణంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆరోగ్యాన్ని, డబ్బునూ కోల్పోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. - పి.శ్రీధర్, చినముషిడివాడ
- మేమంతా వీధిన పడ్డాం..: నా భర్త కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆయనకు మద్యం అలవాటు ఉండడంతో నిత్యం తాగేవారు. నాణ్యత లేని మద్యం తరచుగా తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురై తొమ్మిది నెలల క్రితం మరణించారు. దీంతో మా కుటుంబం దిక్కులేనిదైపోయింది. పిల్లలను పోషించడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. - శోభన, చినముషిడివాడ
- ఎవరిని పలకరించినా అనారోగ్య సమస్యలే..: మా గ్రామంలో చాలామంది రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తారు. వారిలో చాలామంది ప్రతీరోజూ మద్యం తాగుతారు. గతంలో మద్యం తాగినా అనారోగ్యానికి గురైన సందర్భాలు చాలా అరుదుగా ఉండేవి. మూడేళ్ల నుంచి ఎవరిని అడిగినా ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు. మద్యం తాగడం వల్లే సమస్యలని వైద్యులు చెబుతున్నారంటున్నారు. గతంలో రాని రోగాలు ఇప్పుడు వస్తున్నాయంటే మద్యంలో కల్తీ ఉండటమేనని అనుకుంటున్నా. - రాములమ్మ, నరవ
- ఇటీవల మరణాలు ఎక్కువయ్యాయి: గత మూడేళ్లుగా చాలామంది యువకులు సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. దీనికి కారణం యువత అధికంగా మద్యం తాగడమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించి మద్యం అమ్మడం విడ్డూరంగా ఉంది. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. - ఈశ్వరమ్మ, వృద్ధురాలు
- ఎక్కడికక్కడ బెల్టుషాపులు: వైకాపా ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యత లేని రకరకాల మద్యం తయారీకి ఈ రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారు. - పి.రామారావు, భరణికం
- రాబడి కోసమే నాసిరకం మద్యం..: మద్యం మీద వచ్చే రాబడికి అలవాటు పడిన వైకాపా ప్రభుత్వం నాసిరకం మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ మద్యం తాగి యువకుల ఆరోగ్యం సైతం క్షీణించి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే తప్ప మార్పురాదు. దీనికి ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో పనిచేయాలి.
జి. సామ్రాట్కుమార్, అమృతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వైకాపా పాలనలో సహజ వనరుల లూఠీ’
[ 06-05-2024]
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పిలుపునిచ్చారు. ఆదివారం జగదాంబకూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
కోడ్.. ఏమైంది?
[ 06-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా అధికార వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. -
ప్రలోభాల ‘పోస్టల్ బ్యాలట్’...!
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలో ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రారంభమైంది. -
ప్రలోభాల వల.. చిక్కితే విలవిలే!!
[ 06-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్ కనీసం పట్టించుకోలేదు. -
భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు : శ్రీభరత్
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు పెడతామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. -
‘యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం’
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ -
అయిదేళ్లలో కాపులకు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వంగవీటి రాధా ప్రకటించారు. -
ఏప్రిల్లో భారీ రికవరీ
[ 06-05-2024]
విశాఖ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ నెలలో 68 ఆస్తి చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 49 కేసులను ఛేదించినట్లు జె.సి.పి. ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నంలు వెల్లడించారు. -
రైతుకు ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం
[ 06-05-2024]
ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
కూటమి ప్రభుత్వంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కూటమి(జనసేన) దక్షిణం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. -
జిల్లా అభివృద్ధికి పరి‘శ్రమిస్తా’..!
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమితో పిల్లలకు బంగారు భవిత
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
రౌడీగా మారిన బూడికి బుద్ధి చెప్పండి
[ 06-05-2024]
కాపులంతా ఐక్యంగా ఉండి ఎమ్మెల్యే కన్నబాబురాజును చిత్తుగా ఓడించాలని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
ఉచిత బస్సు ప్రయాణం: అనిత
[ 06-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లపాటు వైకాపా చేసిన అరాచకాలకు ప్రజలంతా ఈనెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
అదిరింది అయ్యన్నా!
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు వినూత్న పంథా ఎంచుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్ మినీ స్టేడియంకు వచ్చిన ఆయన వాకర్స్తో నడుస్తూ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం