logo

మాజీ కౌన్సిలర్‌ దంపతుల ఓట్లు గల్లంతు..

జీవీఎంసీ 82వ వార్డు శ్రీరామనగర్‌ కాలనీలో ఉంటున్న మాజీ కౌన్సిలర్‌ యర్రంశెట్టి లక్ష్మి పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు.

Published : 10 May 2024 04:10 IST

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 82వ వార్డు శ్రీరామనగర్‌ కాలనీలో ఉంటున్న మాజీ కౌన్సిలర్‌ యర్రంశెట్టి లక్ష్మి పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఆమె గురువారం సచివాలయానికి వెళ్లి జాబితా పరిశీలించారు. తాను గతంలో అనకాపల్లి పురపాలక సంఘం 34వ వార్డు కౌన్సిలర్‌గా కూడా చేశానని లక్ష్మి తెలిపారు. తన భర్త యర్రంశెట్టి శ్రీనివాసరావు జీవీఎంసీ శానిటరీ విభాగంలో మేస్త్రీగా పనిచేస్తున్నారని, గతంలో అన్ని ఎన్నికల్లో తాము ఓటు వేశామన్నారు. ఇప్పుడు ఇద్దరి ఓట్లు లేవని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని