ఉప్పెనలా రండి.. ఓటెత్తండి..!
పోస్టల్ బ్యాలట్ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు.
స్ఫూర్తి నింపిన ప్రభుత్వ ఉద్యోగులు
13న జరిగే ఎన్నికలకు పౌరులు పోటెత్తాలి..
వన్టౌన్, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలట్ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. పేర్లు లేకపోయినప్పటికీ నిరాశ చెందలేదు. ఎన్నికల అధికారులను సంప్రదించి అక్కడికక్కడే ఫాం-12ను అందజేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం జిల్లా యంత్రాంగం ఏయూ తెలుగు, ఆంగ్లమాధ్యమ పాఠశాలలలో విస్తృత ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మొదటి మూడు రోజుల్లో జిల్లాకు చెందిన ఉద్యోగుల్లో 95శాతం మంది, ఇతర జిల్లాల ఉద్యోగుల్లో 77శాతం మంది ఓటు వినియోగించుకోవడం చూస్తుంటే వారిలో చైతన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇదే స్ఫూర్తి ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు కనబర్చాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.
ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం 1941 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు పెడుతున్నారు. బీఎల్ఓలు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. వాటిల్లో పేరు, ఓటరు జాబితాలో క్రమసంఖ్య, పోలింగ్ కేంద్రం చిరునామా వంటి అంశాలు ఉంటాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పౌరులను కోరుతోంది.
2019లో కేవలం 65.75శాతం మాత్రమే..
2019 ఎన్నికలను పరిశీలిస్తే జిల్లాలో 65.75 శాతం పోలింగ్ నమోదైంది. పెందుర్తి, భీమిలిలో మాత్రమే 70శాతం దాటింది. పశ్చిమంలో అతి తక్కువగా 58.19శాతం నమోదైంది. నాడు తొలిసారి వీవీప్యాట్ యంత్రాలను వినియోగించారు. అప్పటిలో ఆ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఈసారి అలా జరగకుండా ఈసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అదే విధంగా జిల్లాలో ఎక్కడికక్కడ ‘స్వీప్’ కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లలో చైతన్యం కల్పించింది. యువతను ఓటర్లుగా చేర్చడానికి కళాశాలల్లో సదస్సులు నిర్వహించింది. దీంతో జిల్లాలో ఈసారి 70శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.
ఉద్యోగులు తరలిరావడం శుభపరిణామం
అధికారులు నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఓటు హక్కు వినియోగించుకున్నా. గతంలో తపాలా ద్వారా పోస్టల్ బ్యాలట్ పంపేవాళ్లం. ఇప్పుడు పనిచేస్తున్న ప్రాంతంలోనే ఓటు వేయడం ఆనందాన్నిచ్చింది. ఉద్యోగులు భారీ ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామం.
వి.మానస, పంచాయతీ కార్యదర్శి
సిబ్బంది ఎంతో సహకరించారు
నా ఓటు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఉంది. ప్రస్తుతం నేను చంద్రపాలెం జడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్నా. ఫాం-12 ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఏయూ పాఠశాలలోని సిబ్బంది అన్ని విధాల సహకరించడంతో ఇక్కడ ఓటు వేయగలిగా. ఏర్పాట్లు కూడా బాగున్నాయి.
ఎల్.శ్రీదేవి, ఉపాధ్యాయురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
[ 20-05-2024]
కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. -
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
[ 20-05-2024]
ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు. -
మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!
[ 20-05-2024]
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. -
సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!
[ 20-05-2024]
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు. -
వైకాపా నాయకుడి దౌర్జన్యంపై ఫిర్యాదు
[ 20-05-2024]
పప్పుశెట్టిపాలెం సర్పంచి భర్త వైకాపా నాయకుడు రామకృష్ణ నాయుడు తమపై దౌర్జన్యం చేశారని తెదేపా మండల కమిటీ సభ్యుడు బెల్లం కొండలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం
[ 20-05-2024]
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. -
రెచ్చిపోతే చిక్కులే..
[ 20-05-2024]
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్రూమ్ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది. -
కిక్కిరిసిన తీరం
[ 20-05-2024]
ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఆకట్టుకున్న నాటికలు
[ 20-05-2024]
అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. -
రెండవ రోజు కొనసాగిన చందనం అరగదీత
[ 20-05-2024]
వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ