తనివితీరా దర్శనం... తన్మయత్వంలో భక్తజనం
మేడారం మహా జాతరలో రెండు ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతమైన తర్వాత శుక్రవారం మొక్కుల చెల్లింపు కార్యక్రమం కొనసాగింది. భక్తజనులు తొలుత జంపన్నవాగులో పవిత్రస్నానం చేసి వడివడిగా అమ్మల దర్శనం కోసం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. బంగారాన్ని అందంగా కుంకుమ బొట్టుతో తీర్చిదిద్ది ముఖానికి బండారి(పసుపు) పులుముకుని పిల్లా జల్లాతో అమ్మలను తనివితీరా దర్శించుకొని.... తన్మయత్వానికి లోనయ్యారు. మరోవైపు
ఏటూరునాగారం(మేడారం), న్యూస్టుడే
గద్దెల ప్రాంగణంలో..
మేడారం మహా జాతరలో రెండు ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతమైన తర్వాత శుక్రవారం మొక్కుల చెల్లింపు కార్యక్రమం కొనసాగింది. భక్తజనులు తొలుత జంపన్నవాగులో పవిత్రస్నానం చేసి వడివడిగా అమ్మల దర్శనం కోసం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. బంగారాన్ని అందంగా కుంకుమ బొట్టుతో తీర్చిదిద్ది ముఖానికి బండారి(పసుపు) పులుముకుని పిల్లా జల్లాతో అమ్మలను తనివితీరా దర్శించుకొని తన్మయత్వానికి లోనయ్యారు. మరోవైపు అధికారగణం సైతం వరసకట్టి తల్లుల సేవలో తరించారు.
* మేడారం జాతరలో వనదేవతలైన సమ్మక్క-సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి సైతం కొలువై ఉండడంతో భక్తజనం మొక్కులు చెల్లించుకొనేందుకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్షణక్షణానికి పెరుగుతూ వచ్చింది. క్యూలైన్లు కిటకిటలాడాయి.
* ఉదయం తోపులాట...: క్యూలైన్లలో శుక్రవారం ఉదయం భక్తజనులు దేవతల దర్శనానికి ఒక్కసారిగా పోటెత్తడంతో కొన్ని చోట్ల తోపులాట జరిగింది. అక్కడక్కడ కొందరు అస్వస్థతకు గురై క్యూలైన్ల నుంచి బయటికి వచ్చి కొద్దిసేపు సేదతీరారు. కొందరు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోయారు. సింగరేణి రక్షణ బృందాలు వారిని ఆసుపత్రికి చేర్చాయి.
* 6 రోజుల్లో రూ. 4.09 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
* శుక్రవారం ఆర్టీసీ బస్సుల్లో 49,381 మంది మేడారం రాగా, 1.32 లక్షల మంది తిరుగు పయనం అయ్యారు.
* మంత్రి దయాకర్రావు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. సరిగా పనిచేయని వారికి జరిమానా విధించారు.
నేడు గవర్నర్ తమిళిసై రాక
మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై దంపతులు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడారానికి చేరుకుంటారు. అమ్మవార్లను దర్శించుకుని ఎత్తు బెల్లం మొక్కును చెల్లించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
రేవంత్రెడ్డి సైతం..: జాతరకు శనివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి రానున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
తిరుగు ప్రయాణానికి బారులు..
భక్తజనులు తిరుగు ప్రయాణానికి సిద్ధం కావడంతో ఆర్టీసీ బస్టాండు వద్ద భారీగా భక్తజన సందోహం నెలకొంది. దర్శనాల అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో బస్టాండు కిటకిటలాడింది. మరోవైపు పస్రా మీదుగా ప్రైవేటు వాహనాల ప్రయాణికులు సైతం పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. దీంతో పార్కింగ్ స్థలాలు ఒక్కొక్కటిగా ఖాళీ కావడం మొదలైంది. దేవతలందరూ కొలువై ఉండడంతో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది దర్శనానికి ప్రాధాన్యం ఇచ్చారు. విధులు ముగించుకున్న అధికారులు, సిబ్బంది ఇంటి వద్ద ఉన్న తమ పిల్లలకు బొమ్మలు, ఆట వస్తువులు కొనుగోలు చేయడం కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
[ 08-05-2024]
సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్ రింగైనట్లు అనిపించింది. -
రేవంత్ ప్రసంగం.. కాంగ్రెస్లో ఉత్తేజం
[ 08-05-2024]
వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ విజయవంతమైంది. -
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి మధ్య వాగ్వాదం
[ 08-05-2024]
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. -
హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారా..
[ 08-05-2024]
‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి, అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్లో చేరాను తప్ప.. పదవులకు ఆశపడి కాదని’ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మండలంలోని తాటికొండ గ్రామంలో మంగళవారం నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన సింగపురం ఇందిరతో కలిసి పాల్గొని మాట్లాడారు -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
[ 08-05-2024]
వేసవి ఎండల తాపానికి జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుకూలంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అధికారులు మెరుగైన సరఫరాకు గత నాలుగు నెలలుగా చర్యలు చేపట్టారు. -
మేడిగడ్డలో.. మూడు గంటలు
[ 08-05-2024]
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో మూడు గంటల పాటు పరిశీలన చేపట్టారు. -
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
[ 08-05-2024]
మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. గాలిదుమారంతో మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. -
అధిక స్థానాల్లో కాంగ్రెస్దే విజయం
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే ఐదు అమలు చేసింది..రైతుబంధు ద్వారా నిధులు జమచేసింది రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. -
‘మోదీనే దేశానికి పెద్ద దిక్కు’
[ 08-05-2024]
దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు అన్నారు -
రోడ్డుపై చెట్టు విరిగిపడి యువకుడి దుర్మరణం
[ 08-05-2024]
ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. -
ఓటేద్దామని మాటిద్దాం..!
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు -
‘కడియం, అరూరికి ఓటుతో బుద్ధిచెప్పాలి’
[ 08-05-2024]
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. -
వన ప్రేమికుడు... వేలుపుల సారయ్య
[ 08-05-2024]
ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు. -
ఎంపీ ల్యాడ్స్ కేటాయింపు ఇలా..
[ 08-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 08-05-2024]
వరంగల్ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్