కశ్మీరు నుంచి కన్యాకుమారి!!
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 3,800 కిలోమీటర్ల సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు ఆ యువకుడు.
కాజీపేట యువకుడి సైకిల్ యాత్ర పూర్తి
జమ్మూలో రోహన్ ఆనంద్
న్యూస్టుడే, కాజీపేట టౌన్: కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 3,800 కిలోమీటర్ల సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు ఆ యువకుడు. ప్రతేకత ఏమిటంటే బ్యాటరీ, గేర్ లేని చైను సైకిల్పై ఆయన ముందుకు సాగారు. ఐదు నెలల యాత్రలో రెండు పంక్చర్లు, పుల్లలకు రూ.300 ఖర్చు చేశానని చెప్పారు. ఆయనే హనుమకొండ జిల్లా కాజీపేటలోని వెస్ట్సిటీకి చెందిన రోహన్ ఆనంద్. యాత్ర విశేషాలను ఆయన ‘న్యూస్టుడే’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..
‘సర్వ మత సమ్మేళనం మన దేశం. ఇదే మన గొప్పతనం. నా యాత్రలో దేశ ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకొని అన్నం పెట్టి సాగనంపిన తీరు మరిచిపోలేని జ్ఞాపకం. యాత్రకు అమ్మానాన్నే స్ఫూర్తి. నాన్న రవి ఆనంద్ పంజాబీ. రైల్వేలో సీటీఐగా ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ గేల్ ఆనంద్, ఆంగ్లో ఇండియన్. కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మేమిద్దరం అన్నదమ్ములం. నేను మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశాను.
ఆగస్టు 7న వైష్ణోదేవి ఆలయంలో పూజలు చేసి..
ఒక చిన్న సంచి అందులో వాటర్ బాటిల్, జత దుస్తులు, పడుకోవడానికి ఒక పట్టా పెట్టుకొని రైలులో శ్రీనగర్కు వెళ్లాను. గతేడాది ఆగస్టు 7న కట్య్రాలలో వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నా. అనంతరం లాల్చౌక్లో రూ.5,500 పెట్టి సైకిల్ కొని యాత్ర ప్రారంభించాను. జమ్మూలో సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలన్నీ చెప్పిన తర్వాత నాకు రక్షిత ప్రదేశంలో నిద్రకు పంపించారు. మరుసటి రోజు సెల్ఫీ తీసుకుని .. శుభయాత్ర పేరుతో పంపించారు. కశ్మీరు ఉద్దంపూర్, రాంబన్, జమ్మూ, పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని కన్యాకుమారి వరకు యాత్రను సాగింది. ఆగస్టు 7న మొదలుపెట్టి జనవరి 23న పూర్తి చేశాను.
రెండుసార్లు అస్వస్థత..: భిన్న వాతావరణం ఉన్న రాష్ట్రాలను దాటుకుంటూ ప్రయాణం సాగింది. ఒక దశలో చలికి మాట రాలేదు. మరోసారి వైరల్ జ్వరం. యాత్ర నుంచి నిష్క్రమించాలన్న ఆలోచన వచ్చినా.. పట్టుదలతో కదిలాను. యాత్రలో గురుద్వార్, శ్రీకృష్ణ జన్మస్థానం, కురుక్షేత్రం, ఖజరహో, ఆదియోగి విగ్రహం, మధుర మీనాక్షి, దిల్లీలోని క్యాథడ్రల్ చర్చి, ఎర్రకోట, పంజాబ్లోని సుందర ప్రదేశాలను వీక్షించడంతో పాటు బెంగళూర్, మధ్యప్రదేశ్లోని ఎనుగుల క్రాసింగ్, టైగర్ జోన్ ప్రాంతాల మీదుగా యాత్ర సాహసంగా అనిపించింది’ అని చెప్పారు.
అక్కున చేర్చుకొని అన్నం పెట్టి..
యాత్రలో భాగంగా రోజుకు 48 నుంచి 60 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుతూ ప్రయాణం చేశాను. ఎక్కడ ఆగితే అక్కడ ప్రజలు భాషాబేధం లేకుండా అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించారు. నా యాత్ర విశేషాలు తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..