సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా?
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. ఆ సమయంలో నీవు ఓటు వేస్తే సిరా గుర్తు చూపించూ అని ఎదుటివారిని అడగడం చూస్తుంటాం. పోలింగ్లో పాల్గొనే వారికి చెదిరిపోని సిరా గుర్తును పెట్టాలనే నిబంధన ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎడమ చేయి చూపుడు వేలిపై వేసే సిరా చుక్కే నిజమైన ఆధారంగా ప్రతి ఒక్కరూ చూపిస్తూ.. ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాల్లో గుర్తుగా పెడుతున్నారు. సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే అదే చేయిలోని మధ్యవేలుపై సిరా చుక్క అంటించాల్సి ఉంటుంది. ఒక వేళ మధ్యవేలు కూడ లేకుంటే బొటన వేలుపై గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సూచించింది. మరికొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఎడమచేయి తొలగించి ఉంటే కుడిచేయి చూపుడు వేలుకు సిరా చుక్క అంటించాలని, ఆ వేలు కూడా లేకుంటే మధ్యవేలుకు, మధ్యవేలు కూడా లేకుంటే ఉంగరం వేలుకు, రెండు చేతులకు వేళ్లు లేకపోతే చేయి మధ్యభాగంలో, పైభాగంలో, భుజం వద్ద సిరా గుర్తు పెట్టాలని ఈసీ నిబంధనల్లో వివరించింది.
న్యూస్టుడే, వెంకటాపూర్
పోలింగ్ సిబ్బంది మెనూ అదిరింది!
వేసవి ఎండలు మండిపోతున్న తరుణంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి మెనూ మార్చారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలకు ఈనెల 12న సిబ్బంది చేరుకోగానే సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ, తరువాత 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య భోజనంలో అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ అందిస్తారు. పోలింగ్ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 గంటల మధ్య క్యారట్, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ, 11 గంటలకు మజ్జిగ, 12 గంటలకు మజ్జిగ అందిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యన కోడిగుడ్డు కూరతో అన్నం, కూరగాయల కూర, చట్నీ, సాంబారు, పెరుగు అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం, 4 గంటలకు నిమ్మరసం లేదా మజ్జిగ అందిస్తారు. 5.30 గంటలకు టీ, గుడ్డే బిస్కెట్లు అందిస్తారు. ఈ మెనూ అందించే బాధ్యతను గ్రామాల్లో పంచాయతీ అధికారులకు అప్పగించారు. కార్పొరేషన్, పురపాలక సంఘాలలో అధికారులు నియమించిన ఉద్యోగులు పంపిణీ చేయనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.
న్యూస్టుడే, గోపాలపూర్
వాట్సప్ కాల్స్తోనే శ్రీరామరక్ష !
అసలే ఎన్నికల సమయం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో రాజకీయ పార్టీల నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై మనసులో ఎంత కోపమున్నా ముఖంపై నవ్వును పులుముకొని కలుపుగోలుగా ముచ్చటిస్తూ ముందుకు వెళితేనే మేలు కలుగుతుంది. ఈ సారి ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్నాయి. చేతిలో చరవాణి ఉంటే చాలు ఎదుటి వారు మాట్లాడేటప్పుడు ఏ మాత్రం నోరు జారినా రికార్డు చేసి ట్రోల్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ భయంతో వివిధ పార్టీల అభ్యర్థులు, నేతలు ఫోన్లలో ఆచి తూచి మాట్లాడుతున్నారు. సున్నితమైన అంశాలపై చరవాణిలో మాట్లాడాలంటే బెదిరి పోతున్నారు. మాట్లాడే క్రమంలో నోరు జారినా, రహస్య విషయాలను సంభాషిస్తే వాటిని రికార్డు చేసి రట్టు చేసి తమ ప్రతిష్ఠను చెడగొడతారనే భయం నేతలను నీడలా వెంటాడుతోంది. ఈ ప్రమాదంలో చిక్కుకోకుండా ఇటీవల పలువురు అభ్యర్థులు, ముఖ్య నేతలు వాట్సప్ కాల్స్లో మాట్లాడుతున్నారు. వాట్సప్ కాల్స్లో మాట్లాడే మాటలను రికార్డు చేయలేరనే ధీమాతో ఈ కాల్స్నే ఉపయోగిస్తున్నారు.
న్యూస్టుడే, నర్సంపేట
22 రోజుల ఉత్కంఠ తప్పదు!
లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగులు, ఇంటింటా ప్రచారం చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి.. దీంతో ఓటర్ల పని పూర్తవుతుంది. నాయకులకు మాత్రం ఆ మరుసటి రోజు నుంచి ఉత్కంఠ మొదలవుతుంది. 22 రోజుల వరకు ఇది తప్పదు.. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనుంది. అప్పటివరకు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీపడిన అభ్యర్థులు, వారి ముఖ్య అనుచరులు ప్రతి రోజూ పోలింగ్ సరళిపై క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తూ, గెలుపోటములపై అంచనాలు వేసుకోక తప్పదు.
న్యూస్టుడే, భూపాలపల్లి
చరవాణీ ద్వారా ఓటరు చీటి పొందండిలా..!
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోల్ స్లిప్పుల పంపిణీ చేపట్టింది. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి స్లిప్పులు అందిస్తున్నారు. ఆ సమయంలో కొందరు అందుబాటులో లేకపోవడం, చీటీలను పోగొట్టుకోవడం వంటి కారణాలతో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈసీ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏ పోలింగ్ బూత్లో తమ ఓటు ఉందో తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం కేటాయించిన 1950 టోల్ఫ్రీ నంబరుకు సంక్షిప్త సమాచారం పంపిస్తే చాలు జాబితాలో ఉన్న వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇందుకు టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ ద్వారా ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడీ నెంబరును టైప్ చేసి ఎస్ఎంఎస్ చేస్తే చాలు.. 15 నిమిషాల్లో మీ చరవాణీలో పేరు, పార్టు నంబరు, సీరియల్ నంబరు, పోలింగ్ కేంద్రం వివరాలన్నీ వస్తాయి. ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఈసీ కల్పించిన సదుపాయాన్ని ఓటర్లు ఇలా సద్వినియోగం చేసుకోవచ్చు.
న్యూస్టుడే, వెంకటాపురం
ఓటేస్తూ స్వీయ చిత్రాలు తీసుకోవద్దు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువైనదే కాదు రహస్యమైనది కూడా. ఓటును బహిర్గతపరిచేందుకు నిబంధనలు అంగీకరించవు. పోలింగ్ కేంద్రంలో ఓటరు ఓటుహక్కును వినియోగించుకునే క్రమంలో చరవాణితో స్వీయ చిత్రాలు దిగడం, ఇతరులకు చూపడం నిషేధం. ఎవరైనా అలా చేస్తే 49ఎం నిబంధన ప్రకారం (ఓటు రహస్యం) ఓటును బహిర్గతపర్చిన ఓటరును అధికారులు బయటకు పంపిస్తారు. ఎన్నికల నిబంధన 17ఎ లో ఆ ఓటును నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అంటే ఆ ఓటు నిరుపయోగమవుతుంది. అందుకే ఓటర్లూ తస్మాత్ జాగ్రత్త. నిబంధన 49ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 18 ఏళ్లు దాటిన సహాయకుడిని వెంట తీసుకెళ్లవచ్చు. అయితే సదరు సహాయకుడు అంధుడి ఓటును బహిర్గతపర్చనని నిబంధన 10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.
న్యూస్టుడే, నర్సంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు