అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు.
అంతటా కమలం వికసిస్తుంది
జనసభలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ
తొర్రూరు జనసభలో ప్రసంగిస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. పక్కన వరంగల్ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్
తొర్రూరు, న్యూస్టుడే: దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే.. ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు భారతరత్న పదవి ఇచ్చి గౌరవించారని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భాజపా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పాలకుర్తి జనసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వరంగల్ చారిత్రక ప్రాంతమని.. స్మార్ట్ సిటీలో వరంగల్ అభివృద్ధికి కేంద్రం అధిక నిధులు అందజేస్తోందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్తో పాటు తెలంగాణవ్యాప్తంగా కమలం వికసిస్తుందని అన్నారు. ప్రజాసేవలో ఉన్న అరూరి రమేశ్ మచ్చలేని నాయకుడన్నారు. అవినీతికి నిలయమైన కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. వరంగల్ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ను గెలిపించి ప్రధాని నరేంద్రమోదీకి కానుకగా అందించి తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన్ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
రెండున్నర గంటలు ఆలస్యంగా రాక..
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సభకు హాజరుకావాల్సి ఉండగా ఆకస్మికంగా ఆయన పర్యటన రద్దు కావడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా రెండున్నర గంటలు ఆలస్యమైంది. మొదటగా అరూరి, ఇతర నాయకులు ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 1:32 గంటలకు భజన్లాల్ తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ ధర్మారావు తెలుగులోకి తర్జుమా చేశారు. 1:44 గంటలకు ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సాయినగర్కు చెందిన పలువురు ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరారు.
భాజపా శ్రేణుల్లో ఉత్సాహం
తొర్రూరు జనసభ విజయవంతం కావడంతో భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కోరినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సభలో పార్టీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు రామ్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వైవీ రావు, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలు పాల్గొని సభను విజయవంతం చేశారు.
అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్
కాంగ్రెస్ పాలనపై ఐదు నెలలకే ప్రజలకు విరక్తి వచ్చింది. అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని అమలు కాని హామీలను చెప్పి గద్దెనెక్కి విస్మరించారు. ప్రతి మహిళకు రూ.2500, వృద్ధులకు రూ.4 వేల పింఛను, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు, తదితర హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే తొర్రూరు పెద్దచెరువును మినీట్యాంక్బండ్, రోడ్ల మరమ్మతుకు చర్యలు, కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తా. వరంగల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్