అమ్మినోళ్లకు సొమ్ములు..కొన్నోళ్లకు పాట్లు
భీమవరంలో ఓ స్థిరాస్తి వ్యాపారి ఒకే దరఖాస్తుతో పలు ప్రాంతాల్లో స్థలాలు పూడ్చి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి వారు ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా వారి పక్షంలో చేరిపోతుంటారు. వారితో దిగిన ఫొటోలతో భారీ ఫ్లెక్సీలను అనధికారిక
పట్టణాల చుట్టూ అడ్డగోలుగా అనధికారిక లేఅవుట్లు
భీమవరం వద్ద అనధికారిక లేఅవుట్లో రహదారిని ధ్వంసం చేస్తున్న సిబ్బంది
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 18 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. సమీపగ్రామాల్లో అక్రమంగా తవ్విన మట్టిని తెచ్చి దీనిని పూడ్చినట్లు సమాచారం. పడాలలోనూ ఈ తరహాలో 20 ఎకరాల్లో లేఅవుట్ వేసి జాగాలను విక్రయిస్తున్నారు. తణుకు ప్రాంతంలో ఈ తరహా అనధికార లేఅవుట్లు పెద్ద సంఖ్యలు ఉన్నట్లు సమాచారం.
భీమవరంలోని ఓ ప్రాంతంలో పంట బోదెల భూమిని పూడ్చేసి స్థలాల విక్రయాలకు సిద్ధం చేయగా పట్టణప్రణాళిక విభాగం ఉన్నతాధికారులు పరిశీలించి దానిలో రహదారులను తొలగింపజేశారు. ఫిర్యాదులు అందినప్పుడు, ఉన్నతాధికారులు గుర్తించినప్పుడు స్థానిక అధికారులు ఆయా స్థలాల్లోకి వెళ్లి సరిహద్దు రాళ్లను, రహదారులను తొలగించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలున్నాయి.
భీమవరం పట్టణం, న్యూస్టుడే : పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. జనాభా సంఖ్య పెరుగుతూనే ఉండటంతో ఇంటి స్థలాలకు డిమాండ్ ఏర్పడుతోంది. ఇదే అదునుగా పట్ణణ శివార్లలో, సమీప గ్రామాల్లో కొందరు వ్యాపారులు అడ్డగోలుగా అనధికారిక లేఅవుట్లు వేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో భూ వినియోగమార్పిడి రుసుములు చెల్లించకుండానే స్థలాలను పూడ్చేస్తున్నారు. ఇలాంటి లేఅవుట్లలో జాగాలు కొనుగోలు చేసిన కొందరి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారుతోంది. అనుమతులన్నీ ఉన్నాయంటూ విస్తృత ప్రచారం చేయడంతో వారి మాట నమ్మి స్థలం కొనుగోలు చేసిన వారు తరువాత ఇంటి నిర్మాణాలు, రుణాల కోసం నానా అవస్థలు పడుతున్నారు.
నిబంధనలు ఇవీ.. వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు వినియోగించాలంటే నిర్ణీత రుసుములు చెల్లించి అనుమతులు పొందాలి. ప్లాట్లుగా విభజించిన భూమిలో 10శాతం ఆయా పంచాయతీ లేదా పురపాలక సంఘాలకు రిజిస్ట్రేషన్ చేయించాలి. ప్లాట్లలో 40 అడుగుల వెడల్పుతో రహదారులు ఉండాలి. భూమి విలువ ప్రకారం డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాల కల్పనకు కొంతమేర సెక్యూరిటీగా డిపాజిట్ చేయాలి.
కొనసా..గుతూనే.. అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2019లో ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో 1148 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. తాజాగా ప్రతి పట్టణ పరిధిలోనూ అనధికారిక లేఅవుట్లు పుట్టుకొచ్చాయంటే పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు అనధికార లేఅవుట్లలో స్థలాల విక్రయాలు జరగకుండా పట్టణ ప్రణాళిక అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులతో పూర్తి పర్యవేక్షణ చేపట్టామని పట్టణ ప్రణాళిక ఆర్డీ వై.పాండురంగనాయకులు చెప్పారు. గతంలో గుర్తించిన స్థలాల్లో సరిహద్దు రాళ్లను తొలగింపజేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో పరిశీలన జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!