దేవుడి భూమైనా.. శ్మశానమైనా.. కబ్జానే
ఇది తణుకు జాతీయ రహదారి సమీపంలోని కేశవస్వామి ఆలయ భూమి. సర్వే నంబర్ 134లో ఉన్న 15.68 ఎకరాల భూమిలో గతేడాది కూడా పంట వేశారు.
నాయకుల కనుసన్నల్లో తంతు
పట్టించుకోని యంత్రాంగం
ఈనాడు డిజిటల్, ఏలూరు
ఇది తణుకు జాతీయ రహదారి సమీపంలోని కేశవస్వామి ఆలయ భూమి. సర్వే నంబర్ 134లో ఉన్న 15.68 ఎకరాల భూమిలో గతేడాది కూడా పంట వేశారు. నాలుగు నెలల తర్వాత పొలాలు మెరక చేసి ఎగ్జిబిషన్ పెట్టేశారు. దేవాదాయశాఖ భూములను సాగు చేసుకోవాలి. రూపు మార్చి వ్యాపార అవసరాలకు వినియోగించడం నిబంధనల అతిక్రమణే కాదు నేరం. నామమాత్రపు కౌలు చెల్లించే భూమికి ఎగ్జిబిషన్ పెట్టి రూ.లక్షల్లో వసూలు చేశారు. కౌలుకు ఇచ్చే నగదు ఆలయానికి జమ చేసి ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయం జేబుల్లో వేసుకున్నారని తెలుస్తోంది. ఇదంతా వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకుడు చేశారని సమాచారం. రెవెన్యూ, పురపాలక, ఆలయ ఆధికారులంతా జీహుజూర్ అన్నారు. ఇదే ఆలయ పంట భూమిలో రెండేళ్ల క్రితం సీఎం వస్తున్నారని హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ దాన్ని తొలగించలేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి ఆ భూమికి చెల్లించాల్సిన కౌలు చెల్లించేశారు అని అధికారులు, నాయకులు దురుసుగా సమాధానమిస్తున్నారు.
* ఇది ముసునూరు మండలం రమణక్కపేటలో శ్మశాన స్థలం. సమాధులుండాల్సిన చోట దుకాణాలున్నాయి అనుకుంటున్నారా. 259/1లో 6.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొందరు వైకాపా నాయకులు గత మూడేళ్ల నుంచి కబ్జా చేస్తున్నారు. ఇప్పటికి 3 ఎకరాల వరకూ ఆక్రమించి అందులో కోళ్లఫారాలు, మాంసం దుకాణాలు పెట్టారు. వైకాపా నాయకులే ఈ స్థలాన్ని ఆక్రమించారన్నది బహిరంగ రహస్యమే. అయినా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఆక్రమించిన భూమి విలువ రూ.1.5 కోట్లు.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల పర్వం జోరుగా సాగుతోంది. అది దేవాదాయ భూమా..పంచాయతీ జాగానా..శ్మశానం స్థలమా అని చూడరు. నాయకుల అండతో గ్రామాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ ఆక్రమణ చెరలోకి వెళ్లిపోతున్నాయి. వీటిని అడ్డుకోవటంలో అధికారుల వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ స్థలమా..అయితే అడిగేవారెవరూ అని ఇష్టారాజ్యంగా వ్యవహస్తున్నారు.
ఖాళీగా ఉంటే చాలు.. ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందంటే చాలు కొందరు వైకాపా నాయకులు పాగా వేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మెరక చేసి...చిన్న పాక వేస్తారు. వెంటనే భూమి ఏ శాఖ పరిధిలో ఉందో ఆ అధికారులకు పెద్ద నేతలతో సిఫార్సు చేయించి ముడుపులు సమర్పిస్తారు. దీంతో అధికారులు ఆ వైపు చూడటం లేదు. ఇదే అదనుగా ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పెద్దస్థాయి ఆక్రమణలు నేరుగా నియోజకవర్గ స్థాయి నాయకులే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పశ్చిమ గోదావరి కలెక్టర్ ప్రశాంతి, ఏలూరు జేసీ ఆరుణ్బాబును వివరణ కోరగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముసునూరు మండలం రమణక్కపేట పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో భూమి ఆక్రమించి నిర్మాణం కూడా మొదలుపెట్టారు. 162/15 సర్వేనంబర్లో పంచాయతీ కార్యాలయానికి దాతలు ఇచ్చిన స్థలంలో రెండు సెంట్ల భూమి ఖాళీగా ఉంది. దాన్ని ఓ వైకాపా నేత ఆక్రమించి దుకాణ నిర్మాణం చేపట్టారు. అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాబందులే నయం.. పీక్కు తినడమే ఈ నేతల పని!
[ 10-05-2024]
వైకాపా నేతల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో వసూళ్ల దందా చేస్తూ సామాన్యులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. -
జగన్ సాగుబడిలో.. అన్నదాతకు అష్టకష్టాలు
[ 10-05-2024]
‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు. -
ఉద్యోగాలేవి జగన్
[ 10-05-2024]
ఆశలు ఆవిరై.. బతుకు భారమైన వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. -
నేడు ఉండిలో ప్రజాగళం సభ
[ 10-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండిలో శుక్రవారం ఉదయం ప్రజాగళం సభలో పాల్గొంటారు. -
కొండంత రాగం తీసి... అన్నీ కోతేశారు
[ 10-05-2024]
రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్పామ్ పంటను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
చివరి అస్త్రాలకు పదును
[ 10-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
తాయిలాల పంపిణీ లేకుండా నిఘా : కలెక్టర్
[ 10-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో 72 గంటల పాటు అమల్లో ఉంటుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
తెరుచుకున్న రామలింగేశ్వరస్వామి ఆలయం
[ 10-05-2024]
నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. -
జగన్ గారడీ..బీఎల్వోలకు బురిడీ!
[ 10-05-2024]
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్ బురిడీ కొట్టించారు. -
మూడు రోజుల్లో సైకో పాలనకు చరమగీతం
[ 10-05-2024]
అయిదేళ్లుగా సైకోపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజుల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడనున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు: దేవినేని
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
గుక్కెడు నీటికీ యాతనే!
[ 10-05-2024]
ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘ ప్రజలను తాగునీటి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. -
అరాచక పాలకులు మనకొద్దు: రఘురామ
[ 10-05-2024]
అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
11న సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలు
[ 10-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM