డిమాండ్ల సాధనకు ఉద్యమం
సమస్యలు చెబుదామంటే వినకపోగా నిర్బంధాలకు గురి చేయడం దారుణమని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో భీమవరంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సాబ్జీ, కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది
భీమవరం అర్బన్, న్యూస్టుడే: సమస్యలు చెబుదామంటే వినకపోగా నిర్బంధాలకు గురి చేయడం దారుణమని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో భీమవరంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు సంరక్షణకు పాటుపడుతున్న అంగన్వాడీ సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్రాయ్ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి చరవాణులు ఇచ్చిన ప్రభుత్వం వివిధ రకాల యాప్లలో వివరాల నమోదు పేరిట వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి కళ్యాణి, సీఐటీయూ నాయకులు వాసుదేవరావు, పీవీ ప్రతాప్ తదితరులు మాట్లాడుతూ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా శిబిరానికి వచ్చిన ఐసీడీఎస్ పీడీ సుజాతరాణికి సమస్యలు వివరించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారిణి కృష్ణవేణికి వినతిపత్రం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం.. చింతలపూడి పూర్తి చేస్తాం
[ 08-05-2024]
‘ఆంధ్రుల జీవనాడి..చంద్రబాబు కలల సౌధం పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తా. కేంద్ర సహకారంతో వేగంగా నిర్మాణ పనులు జరుగుతాయి. -
ఏం మార్చారు.. ఏమార్చారంతే?
[ 08-05-2024]
‘‘సీఎం మాటలకు... క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం హామీలకే పరిమితమైంది. దెబ్బతిన్న పరికరాలు, శిథిలమైన భవనాలు... సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో వైద్యమంటేనే గిరిజనులు వెనకడుగు వేస్తున్నారు.’ -
ప్రశ్నించే గొంతుకలపై దౌర్జన్యకాండ
[ 08-05-2024]
ప్రతిపక్షాలకు నోరెత్తే స్వేచ్ఛ లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా గత అయిదేళ్లు అక్రమ కేసుల పరంపరను కొనసాగించింది. ప్రతిపక్షాలను నోరు నొక్కేస్తే సాధారణ ప్రజలు కుక్కిన పేనుల్లా పడుంటారులే అన్న నియంతృత్వ పోకడలు జగన్ జమానాలో అడుగడుగునా కనిపించాయి -
యువతకు ఉపాధి ఆక్వాకు ఊతం
[ 08-05-2024]
‘వైకాపా అస్తవ్యస్త విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి అన్ని వర్గాలకు విముక్తి కల్పించేలా కూటమి మ్యానిఫెస్టోను ప్రకటించాం. -
విప్లవ ధ్రువతార అల్లూరి
[ 08-05-2024]
విప్లవ ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు ధ్రువతార అని పలువురు వక్తలు కొనియాడారు. -
నేడు ఈసెట్
[ 08-05-2024]
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్ నిర్వహించనున్నారు -
గోదారికి వదిలేసిన జగన్
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటిగట్టు పరిరక్షణ పనుల నుంచి గోదావరిలో గ్రోయిన్ల నిర్మాణానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. -
జలఘోష పట్టదా.. జగన్
[ 08-05-2024]
గోదారి ప్రవహించే జిల్లాలో జలఘోష వినిపిస్తోంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి... అపరాత్రి తేడా లేకుండా కుళాయిల్లో బిందెడు నీటికి అర్రులుచాస్తున్నారు. -
గుత్తేదారును గుల్ల చేసిన పెత్తందారు!
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2015 మొదలు 2019 వరకు తెదేపా హయాంలో చేపట్టిన పనులు చేయడానికి గుత్తేదారులు పోటీపడేవారు. టెండర్లు పిలిస్తే చాలు ప్రతిపాదిత వ్యయానికంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసేవారు. -
ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
[ 08-05-2024]
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది -
పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల వీడియో గ్రాఫర్పై వైకాపా శ్రేణుల దాడి
[ 08-05-2024]
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది.